అందోల్, జూన్ 28 : ఆన్లైన్ ఆటలు యువత జీవితాలు నాశనం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా అందోల్లో తండ్రికి తెలియకుండా ఆన్లైన్ లో గేమ్స్ ఆడిన యువకుడు రూ. 25 వేల వరకు పోగొట్టుకున్నాడు. తండ్రికి సమాధానం చెప్పలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందోల్కు చెందిన దాసరి మధు(19) ఇంటర్ వరకు చదువుకుని ఇంటివద్దే ఉంటున్నాడు. కొన్ని రోజులుగా ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడిన మధు రూ. 25 వేల వరకు పోగొట్టుకున్నాడు. దీం తో తండ్రికి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక సోమవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబసభ్యులు అతడిని సంగారెడ్డికి తరలించి చికిత్స అం దించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం హైదరాబాద్ తరలించగా అక్కడ చికిత్స పొం దుతూ పరిస్థితి విషమించి శుక్రవారం మృతిచెందాడు. మృతుడి తండ్రి సత్య య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై అరుణ్కుమార్గౌడ్ తెలిపారు.