సిద్దిపేట జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరుగుతున్నంత సేపు తమకేమీ పట్టనట్లుగా అధికారులు వ్యవహరించారు. సమావేశంలో జరిగే విషయాలు పట్టించుకోకుండా సెల్ఫోన్లలో బిజీగా గడిపారు. అందరికీ ఉపయోగపడే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమిటని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓ వైపు జిల్లా అధికారులు సర్వసభ్య సమావేశానికి సకాలంలో హాజరుకాకపోవడం, మరోవైపు సమావేశానికి వచ్చి ఎవరి ఫోన్లలో వారు గడుపుతూ సమయాన్ని వృథా చేయడం విమర్శలకు తావిస్తుంది.