సిద్దిపేట ప్రతినిధి/ సిద్దిపేట, ఆగస్టు 20(నమస్తే తెలంగాణ) : సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంపూర్ణ రుణమాఫీ సాధనకై జరిగిన కార్యాచరణ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వంటేరు ప్రతాప్రెడ్డి, దేవీప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరు రైతులకు పంటరుణాల మాఫీ చేయడంలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందన్నారు. సిద్దిపేటకు గొప్ప చరిత్ర ఉందని.. పౌరుషానికి, రేషానికి, త్యాగానికి సిద్దిపేట అడ్డా అన్నారు. ఉద్యమానికి, ఉద్యమకారులకు తెలంగాణ సాధించిన గడ్డ సిద్దిపేట అన్నారు. కాంగ్రెస్ కుటిల రాజకీయాలను తిప్పికొడతామన్నారు.