దుబ్బాక, మార్చి 14: కాంగ్రెస్ సర్కారులో కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో గిరిజన మహిళలు గోడు వెల్లబోసుకున్నారు. గురువారం దుబ్బాక మండలం వెంకటగిరి తండాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి పర్యటించారు.
ఆ గ్రామ తాజామాజీ సర్పంచ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన ఎమ్మెల్యే స్థానిక మహిళలతో ముచ్చటించారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులో నిత్యం కరెంట్కు కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నల్లా నీళ్లు సరిగా రావడం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కష్టాలు తెచ్చిందని ఆరోపించారు.
పట్టణంలోని ఓ కాలనీలో ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి పర్యటిస్తున్న క్రమంలో బోరు నీరు వృథాగా పోతున్నది. గమణించిన ఎమ్మెల్యే వెంటనే అక్కడికి వెళ్లి మోటర్ స్విచ్ ఆఫ్ చేశారు. వేసవి దృష్ట్యా నీరు వృథా కానివొద్దని సూచించారు. దుబ్బాక పట్టణంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆస ముత్యం కుమారుడు సాగర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట కౌన్సిలర్లు యాదగిరి, స్వామి, శ్రీనివాస్, భూంరెడ్డి, కిషన్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.