చేర్యాల, ఆగస్టు 22: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులందరికీ రుణమాఫీ అయ్యే వరకు రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యం లో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలకు చెందిన రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగడి బజారులోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ముస్త్యాల నాగేశ్వరరా వు ఆధ్వర్యంలో జరిగిన రైతుల ధర్నాలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.
రెండ్రోజుల్లో తపాస్పల్లి, లద్నూర్ రిజర్వాయర్లకు గోదావరి జలాలు వదలాలి, లేకపోతే రైతులతో కలిసి నీటి పారుదల ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కేసులు పెట్టినా, జైలుకు పంపినా పోరాటాన్ని మా త్రం ఆపేది లేదని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపారాణీశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, మేక సంతోశ్కుమార్, మంద యాదగిరి, గీస భిక్షపతి, మాజీ ఎంపీపీలు ఉల్లంపల్లి కరుణాకర్, బద్దిపడగ కృష్ణారెడ్డి, తలారి కీర్తనాకిషన్,
మాజీ జడ్పీటీసీ సిలివేరు సిద్దప్ప, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశం, మాజీ వైస్చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మంగోలు చంటి, కౌన్సిలర్ పచ్చిమడ్ల సతీశ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకాల పర్వతాలు, సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు పెడుతల ఎల్లారెడ్డి, వంగ భాస్కర్రెడ్డి, చొప్పరి వరలక్ష్మీసాగర్, బీఆర్ఎస్ యూత్ డివిజన్ అధ్యక్షుడు శివగారి అంజయ్య, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు ముస్త్యాల అరుణ, పచ్చిమడ్ల మానస, తాడెం రంజిత, మీస పార్వతి, కర్ర అరుణ, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల నాయకులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.