గజ్వేల్, ఆగస్టు 19: ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభు త్వం మాట నిలబెట్టుకోలేదు. మూడు విడతలుగా రుణమాఫీ చేసినా, అందులో కూడా అనేక రకాల నిబంధనలు అమలు చేసింది. దీంతో అర్హులైన చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కారం గ్రామానికి చెందిన రైతులు ప్రజ్ఞాపూర్లోని మంజీరా గ్రామీణ వికాస్ బ్యాంకు, గజ్వేల్లోని సహకార బ్యాంకులో వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. రుణా లు తీసుకోవడంతో పాటు ఏటా రుణాలను రెన్యువల్ చేస్తున్నారు.
రెండు నెలలుగా ప్రభు త్వం చేపట్టిన రైతు రుణమాఫీలో అర్హులైన చాలామంది పేరు జాబితాలో రాకపోవడంతో బ్యాం కుల చుట్టూ తిరుగుతున్నారు. అక్కారం గ్రామం లో మొదటి విడతలో 232 మందికి, రెండో విడతలో 119 మందికి రుణమాఫీ జరిగింది. మూడో విడతలో రూ.2 లక్షల లోపు తీసుకున్న రైతుల్లో కొద్ది మం దికే మాఫీ కావడంతో ఐదు రోజులుగా చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది వానకాలంలో రుణాలు రెన్యువల్ చేసుకున్నా మాఫీ కాలేదని రైతులు వాపోతున్నారు. ప్రతిరోజూ బ్యాంకుల చుట్టూ తిరుగుతున్న సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు.
ప్రజ్ఞాపూర్ మంజీరా గ్రామీణ వికాస్ బ్యాంకులో రూ.1.90లక్షల క్రాప్లోన్ తీసుకున్న. రెండు లక్షలోపు రుణమాఫీలో నా పేరు రాలేదు. రెండు లక్షలపై బడిన డబ్బులుంటే రెన్యువల్ చేశా. అయినా నాకు రుణమాఫీ కాలేదు. అదే బ్యాం కులో నా భార్య బాలమణి పేరుమీద రూ.20 వేలు క్రాప్లోన్ తీసుకున్నా. మాఇద్దరిలో ఎవరికి రుణమాఫీ కాలేదు. తక్కువ డబ్బులు తీసుకున్న నాభార్య పేరుమీదైన రుణమాఫీ కాలేదు. కుటుంబలో ఒక్కరికైనా అవకాశం వస్తే సంతోషిం చే వాళ్లం. ప్రభుత్వ ని బంధనలతో చాలా నష్టపోతున్నాం.
– గుండబోయిన మల్లేశం, రైతు, అక్కారం, గజ్వేల్ మండలం
ఇంట్లో నాతోపాటు ఇద్ద రు కొడుకులు బ్యాంకు లో క్రాప్లోన్ తీసుకు న్నాం. ప్రభుత్వం మూ డు విడతలుగా చేసిన రుణమాఫీలో మా ఇం ట్లో ఒక్కరికి కూడా మా ఫీ కాలేదు. నాపేరు మీద రూ.50 వేలు, పెద్దో డు శంకర్గౌడ్పై రూ.81వేలు, చిన్నోడు బాబుగౌడ్ మీద రూ.71వేలు ప్రజ్ఞాపూర్ బ్యాంకులో క్రాప్లోన్ తీసుకున్నాం. మా కుటుంబంలో ఒక్కరికైన మాఫీ చేయలేదు. ప్రభుత్వం అలా చేయడం బాగాలేదు. నాలా చాలామంది రైతులకు రుణమాఫీ కాక ఇబ్బంది పడుతున్నారు.
– బైరి రామాగౌడ్, రైతు, అక్కారం, గజ్వేల్ మండలం
నేను వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి బ్యాం కులో తీసుకున్న క్రాప్లోన్ ఎన్నడూ మాఫీ కా లేదు. నా పేరు మీద రూ.1.60లక్షలు, నా భార్య పేరుమీద రూ.60 వేల క్రాప్లోన్ తీసుకున్న. కొద్ది రోజుల క్రితమే బ్యాంకులో తీసుకున్న అసలు కు రూ.30వేల మిత్తి కట్టి రెన్యువల్ చేసుకున్న. అయినా రుణమాఫీ కాలేదు. అధికారులను ఎవరిని అడిగినా న్యాయం జరగడం లేదు. బ్యాంకులో అడిగితే వస్తే ఇస్తామని చెప్పుతున్నారు. ప్రభుత్వం నాలాం టి రైతులకు న్యాయం చేయాలి.
-మంద యాదయ్య, అక్కారం, గజ్వేల్ మండలం