న్యాల్కల్, జూలై 2 : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మారుమూల గ్రామాల ప్రజలకు పల్లె వెలుగు సేవలు అందడం లేదు. మండలంలోని రేజింతల్, మల్కన్పాడ్, న్యామతాబాద్, హుస్సేల్లి, గుంజోట్టి, రాంతీర్థం, చినిగేపల్లి, మల్గి, రత్నాపూర్, మరియంపూర్, రాఘవపూర్, కాకిజనవాడ, అమీరాబాద్, ముర్తుజాపూర్, తాట్పల్లి, టేకూర్ తదితర గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా పల్లె వెలుగు బస్సు సౌకర్యం లేక ప్రజలతో పాటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులు కళాశాలలు, పాఠశాలలకు ఆ టోలు, బైక్లపై వెళ్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినా మండలంలోని గణేశ్పూర్ గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. రాజోలా, మామిడ్గి, వడ్డి గ్రామాలకు చెందిన విద్యార్థుల సౌకర్యార్ధం ఉదయం, సాయంత్రం మాత్రమే జహీరాబాద్ ఆర్టీసీ డిపో బస్సులను నడుపుతున్నారు. నారాయణఖేడ్ డిపోకు చెందిన బస్సులు జహీరాబాద్, బీదర్ రూట్లలోనే నడుపుతున్నారు.
రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ చాలాగ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సులు నడపడం లేదు. పాఠశాల, కళాశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆటోలు, బైక్లపై వెళ్తున్నారు. పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి