నారాయణఖేడ్, ఆగస్టు 22: రుణమాఫీతోపాటు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి అమలు చేయిస్తామని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆంక్షలు లేకుండా సంపూర్ణంగా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం నారాయణఖేడ్లో రాజీవ్చౌక్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. ‘సీఎం రేవంత్ చిల్లర మనిషి..
వజన్దార్ కాదు.. కేసీఆర్ ప్రాణం పోసి తెలంగాణను మల్పిండు, ఇప్పుడు అందరూ నేను పెద్ద.. నేను పెద్ద అని ఉరుకులాడుతున్నరు. నారాయణఖేడ్ మండలం అంత్వార్ మాజీ సర్పంచ్ సాల్మన్ పాడిన ‘దండు కొయ్య పట్టాలే.. దండు గట్టి దంచాలే’ పాట కూడా బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నగేశ్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పరమేశ్, విఠల్రావు, రాంసింగ్, పండరి, మాజీ జడ్పీ కోఆప్షన్ అలీ, మాజీ ఎంపీపీలు మహిపాల్రెడ్డి, జంగం శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీలు నర్సింహారెడ్డి, ఆంజనేయులు, నాయకులు నజీబ్, ముజామిల్, పార్శెట్టి సంగప్ప, మల్గొండ తదితరులు పాల్గొన్నారు.