ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, మోసపూరిత వాగ్ధ్దానాలు, అబద్ధపు ప్రచారాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఎనిమిది నెలల్లో ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల కరెంట్, ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని కాపాడరన్నారు.
హరీశ్రావు సవాల్తోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి ఆగమేఘాల ఆగస్టు 15 వరకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పి రూ.31 వేల కోట్ల రైతుల రుణాలకు కేవలం రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేసి హరీశ్రావు రాజీనామా చేయాలని మాట్లాడడం హాస్యస్పదంగా ఉందన్నారు. రుణమాఫీ ఎంత మందికి రైతులకు అయిందో ఎమ్మెల్యేలు గ్రామాలకు వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. డిసెంబర్ 9కి ముందు లేని షరతులు ఇప్పుడెందుకు వచ్చాయన్నారు.
మహిళలకు రూ.2500 మహాలక్ష్మి స్కీమ్ ఇస్తామని చెప్పి వాటి ఊసే ఎత్తడం లేదన్నారు. ప్రశాంతంగా ఉన్న సిద్దిపేట వాతావరణాన్ని చెడగొట్టేందుకే సిద్దిపేటపై దండయాత్రకు వస్తున్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, తగిన గుణపాఠం చెబుతారన్నారు. సిద్దిపేటలో ప్రజలపై జరిగిన దాడిలో సీఎం హస్తం ఉందా.. అని ప్రశ్నించారు. సీఎం హస్తం ఉంటే రేపు జరగబోయే పరిణామాలకు సీఎం రేవంత్రెడ్డే బాధ్యత వహించాలని పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.