చేగుంట, జూన్ 28: మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. వందకు పైగా మేకలు మృతిచెందాయి. చేగుంట పోలీసుల వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన ఎండీ ఇబ్ర హీం(21), చిక్వ రాజు(57), చిక్వ మనీశ్ (30), ఎండీ షబ్బీర్ఖాన్(48), ఎండీ జిసన్(21), రమేశ్, మహేశ్, శుక్లాల్,లాల్మని మేకల వ్యా పారి, మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన లారీ డ్రైవర్ బుట్టాసింగ్ కలిసి నాగ్పూర్ నుంచి 450 మేకలను గురువారం లారీలో నింపుకొని హైదరాబాద్ మేకల మండీకి బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున 5గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం బైపాస్ రోడ్డులో ముందుగా వెళ్తున్న లారీని వీరి లారీ వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. రమేశ్, మహేశ్, శుక్లాల్, లాల్మని, బుట్టాసింగ్కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 అంబులెన్స్లో హైదరాబాద్ గాం ధీ దవాఖానకు తరలించారు.ఐదుగురితో పాటు వందకు పైగా మేకలు మృతి చెందాయి. ఘటనా స్థలానికి తూప్రాన్ డీఎస్పీ వెంకట్రెడ్డి, రామాయంపేట సీఐ వెంకటరాజాగౌడ్, చేగుంట ఎస్సై బాల్రాజు సిబ్బందితో చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు లారీలను రోడ్డుపై నుంచి తొలిగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమ్తితం తూప్రాన్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటు చేగుంట ఎస్సై బాల్రాజు తెలిపారు.