చేర్యాల, జూన్ 30 : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో క్షేత్రం మార్మోగింది. ఆదివారం 10వేల మంది భక్తులు వచ్చినట్లు ఆలయ ఈవో బాలాజీశర్మ తెలిపారు. శనివారం సాయంత్రం నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు. కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాల్లో మల్లన్న ఆలయ ఏఈవోలు గంగా శ్రీనివాస్, బుద్ధి శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు పాల్గొన్నారు.