ములుగు, జూన్ 21: తెలంగాణ రాక ముందు కరెంట్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడు కరెంట్ వస్తదో పోతదో తెల్వక ఎన్నో గోసలు పడ్డం. ఏనాడూ కంటి నిండా నిద్ర కూడా పోలేదు. కరెంట్ కోసం రాత్రంతా జాగారం చేసేటోళ్లం. ఎంతో మంది రైతులు విద్యుత్ షాక్తో ప్రాణాలు వదిలిండ్రు. కేసీఆర్ సారు పుణ్యమా అని రాత్రి పూట బాయిలకాడ పండే బాధలు పోయినయ్. 24గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చుడుతోటి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మోటర్లు ఆన్ చేసి పంటలకు నీరు అందించుకున్నం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంక మళ్ల కరెంటు కష్టాలు మొదలైనయ్.
– సాయిలు, రైతు, మాచాన్పల్లి
రాయపోల్, జూన్ 21 : రైతులు సంతోషంగా లేరు..తెలంగాణ రాక ముందు ఎట్లుండెనో ఇప్పుడూ అదే పరిస్థితి. ఇటు కాలం బాగలేదు. పంటలు చేతికొచ్చే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తే ఇష్టం వచ్చిన పంటలు పండించినం. కాంగ్రెస్ అచ్చినంక మళ్లీ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి. ఊళ్లో ఎవరిని ఆడిగినా కరెంట్ ఎప్పుడు వస్తుదో చెప్పలేని పరిస్థితి. వ్యవసాయానికి 24 గంటలు, గృహ అవసరాలు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ను అందించిన ఘనత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కే దక్కుతుంది. విద్యుత్ విషయంతో కేసీఆర్ హయాంలో పండుగలా ఉండేది. నేడు బోర్లు వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
-బాగన్నగారి రంగారెడ్డి, రైతు, రాయపోల్ మండలం
సిద్దిపేట కమాన్, జూన్ 21: కేసీఆర్ పాలనలో కరెంట్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండే. రెప్పపాటు సమయం కరెంటు పోయేది కాదు. ఇప్పుడు కరెంటు కోతలతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. కరెంటు మాటమాటికి ట్రిప్ అవుతుంది. రాత్రి సమయంలో కరెంటు పోతున్నది. పిల్లలు, వృద్ధులు కరెంటు పోతే ఇబ్బందులు పడాల్సి వసున్నది.కరెంటోళ్లకు ఫోన్ చేస్తే చెట్ల కొమ్మలు కట్ చేస్తున్నామని..లైన్ రిపేరు ఉందని, ఏదో ఒకటి చెబుతూ ఫోన్ కట్ చేస్తున్నారు. ఒక్కో సమయంలో రెండు గంటలపాటు కరెంటు నిలిచిన సందర్భాలూ ఉన్నాయి. బీఆర్ఎస్ పాలనలో కరెంటు అసలే పోలేదు. మళ్లీ పాతరోజులే వచ్చాయి.
– పవన్ , సిద్దిపేట
రామాయంపేట, జూన్ 21: పదేండ్లు మాకు కరెంట్ కష్టాలే తెల్వదు. కేసీఆర్ సార్ ఎక్కడి నుంచి తెచ్చిండో ఏమో గానీ, మేము ఎప్పుడూ కూడా కరెంటు కోసం ఎదురు చూడలేదు. పదేండ్ల నుంచి వ్యవసాయం పండుగలా చేసుకున్నాం. కాంగ్రెస్ అచ్చినంక తెలంగాణ రాకముందు ఎలాంటి కష్టాలు పడ్డామో, మళ్లీ ఇప్పుడు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్ సర్కారు రావడంతోనే యాసంగిలో పడిన కష్టాలు ఎప్పుడూ పడలేదు. రైతులు వేసిన వరికి సరిగా నీరందక, కరెంట్ లేక తీవ్రమైన నష్టాలకు గురయ్యాం. వానకాలంలోనైనా కరెంట్ సక్కగ వస్తదో, రాదో తెలియడం లేదు. ఇప్పుడే ఇన్ని కష్టాలు ఉంటే.. రేపు ఇంకెన్ని కష్టాలు ఉంటాయో.
-అన్మమైన రాజయ్య, రైతు, రామాయంపేట
రామాయంపేట, జూన్ 21: కరెంటు సరిగ్గా ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ సార్ను బద్నాం చేస్తుండ్రు. గప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు మంచిగ కరెంటు ఉండే. గిప్పుడైతే కరెంటు గంట కూడా ఉంటలేదు. వంటింట్లో పని చేసుకుందామంటే కరెంట్తో తిప్పలైతుంది. కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు మాకు ఏ దానికి ఇబ్బంది లేకుండే. మళ్లీ ఇప్పుడు కరెంట్ కష్టాలు మొదలైనాయ్. మంచిగా కరెంట్ ఇచ్చిన సార్ మీద ఏవేవో బద్నాంలు లేపుతుండ్రు అది మంచి పద్ధతి కాదు. మీరు కూడా మంచిగా కరెంట్ ఇచ్చి మంచిపేరు తెచ్చుకోండ్రి.
-మెక్కొండ వసంత, గృహిణి, రామాయంపేట
మిరుదొడ్డి, జూన్ 21 : కాంగ్రెస్ మళ్లీ కరెంట్ కష్టాలు తెచ్చిం ది. పదేండ్ల కేసీఆర్ పాలనలో రైతుల బాయిలకాడికి, ఇండ్లకు 24 గంటలపాటు కరెంట్ పోకుంటా ఇచ్చిండు. గియ్యాల కాంగ్రెసోళ్లు అచ్చినంకా మళ్లీ పాత రోజులే అచ్చినయ్. సక్కగా కరెంట్ రాకా యాసంగిలో ఏసీన వరి పంట ఎండిపోయింది. కరెంట్ గిట్లపోతే రైతులందరికీ శాన భాదైతది. సీఎం రేవంత్ రెడ్డి బాయిల కాడికి, ఇండ్ల కాడికి సక్కగా కరెంటు ఇయాలే. లేకుంటే ఇబ్బందులే&గిట్ల కరెంట్ అచ్చుడు..పోవుడు అతే అందరికీ నష్టమే&మరీ సర్కారు ఆలోచన చేసి మంచిగా కరెంట్ ఇయాలే&
-ర్యాకం కిష్టయ్య, రైతు, మిరుదొడ్డి
తెలంగాణ సర్కారు హయాంలో రైతుల పొలాలకు నిరంతర కరెంట్ వచ్చేది. కాంగ్రెస్ వచ్చినంక ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మళ్లీ పాతరోజులు వచ్చినయ్. కరెంట్ ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలువకుండా పోయింది. ఇట్లా అయితే రైతుల పరిస్థితి ఏమిటి. ఎవుసాన్నే నమ్ముకున్న రైతులం. కరంట్ ఉంటేనే పంటలు పండుతయ్.. లేకపోతే పంటకు పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం అంతా వృథా అవుతుంది. కరం ట్ సరిగా లేకపోతే కరువు వస్తుంది. మా రైతుల పరిస్థితి తిరిగి అప్పులపాలైతది. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు రైతుల గురించి ఆలోచన చేసి నిరంతర కరెంట్ ఇవ్వాలి. రైతు ఏడిస్తే రాజ్యంలో కరువుకాటకాలు తాండవిస్తాయని కాంగ్రెసోళ్లు గుర్తుంచుకోవాలి.
-విష్ణువర్ధన్రెడ్డి, రైతు, గుమ్మడిదల గ్రామం, మండలం