మిరుదొడ్డి, జూన్ 20: లోవోల్టేజీతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే టూఫేజ్ (డిమ్ము) కరెంట్తో మోటర్లు కాలిపోయి పంటలు పండక రైతులు శాన బాధలు పడుతున్నారు. కాలిపోయిన మోటర్లు రిపేరు చేస్తే మాకు కొన్ని డబ్బులు అచ్చినాయి. కానీ రైతులు మాత్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ సార్ ప్రభు త్వం ఉండగా రైతులకు కరెంట్ కష్టాలు అస్సలు లేవు. 24 గంటలు కరెంట్ అట్టింది. మాకు మోటర్ల పని లేనేలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకు కరెంట్ కష్టాలు మల్లా మొదలైనయి. కరెంటు గిట్లా ఉంటే ప్రజలందరికీ కష్టాలే.
– మద్దెల యాదగిరి, మోటర్ మెకానిక్, మిరుదొడ్డి
హుస్నాబాద్ టౌన్, జూన్ 20: తెలంగాణ రాకముందు కరెంట్ అధ్వాన్నంగా ఉండే. కరెంట్ ఎప్పుడు అత్తదో&ఎప్పుడు పోతదో తెల్వదు. ఒకవేళ అచ్చినా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవవుడు, సక్కగ రాకపోవవుడు ఉండే. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ట్రాక్టర్లలో తీసుకపోవుడు… రోజుల తరబడి సూసుకుంట అక్కడే ఉండేది. తెలంగాణ అచ్చినంక కేసీఆర్ సీఎం అయినంక అన్ని కరెంట్ ఇబ్బందులు పోయినయి.. కేసీఆర్ గెలిచినప్పటి నుంచి రైతులకు ఏ లోటులేకుండా అయింది. ఆయన అచ్చినంకనే రైతులకు న్యాయం జరిగింది. నిజంగా చెప్పాలంటే రైతులకు ఏ రందీ లేకుండా ఎవుసం జరకిగింది. మళ్లీ కాంగ్రెస్ అచ్చినంక మళ్లీ మొదటికొచ్చింది.
– మర్యాల రాంరెడ్డి, రైతు, హుస్నాబాద్ టౌన్
తొగుట జూన్ జూన్ 20: కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు 24 గంటల కరెంటు అచ్చేది. అప్పుడు బాయిలకాడ బోరుమోటర్లు అస్సలు కాలిపోయేవి కాదు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చినంక కరెంటు ఎప్పుడు వస్తదో.. ఎప్పుడు పోతదో తెలియడం లేదు. చిన్నపాటి వర్షం ఈదురుగాలులకు కరెంటు తీస్తుండడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పదేంద్ల కేసీఆర్ పాలనలో రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. ఇప్పుడు లోవోల్టేజీతో మోటర్లు కాలిపోయి రైతులు అటు ఆర్థికంగా, ఇటు పంటలు సరిగా పండక సష్టపోతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుండే. కేసీఆర్ మళ్లీ రాకపాయే…
– పాత్కుల బాలయ్య, రైతు, వెంకట్రావుపేట గ్రామం
నిజాంపేట, జూన్ 20: కేసీఆర్ అందించిన 24 గంటల కరెంట్తో రైతులు వ్యవసాయం చేసుకుంటూ మంచిగా బతికిండ్రు. టైంకు రైతుబంధు పైసలు వస్తుండే వాటితో ఎరువులు, విత్తనాలు కొని ఎవుసం పనులు మొదలుపెట్టెటోళ్లం. పుష్కలంగా కరెంట్, నీళ్లు ఉండడంతో ఏ రందీ లేకుండా ఆనందంగా పంట లు పండించుకొని మంచిగా ఉండేవాళ్లం. ఎవుసం అంటే ఎంటో తెలియని పాలకుల చేతికి తెలంగాణ రాష్ట్రం చిక్కింది. కరెంట్ ఎప్పుడోస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు పొలాల కాడ కరెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ వచ్చే కరెంట్ కూడా సక్కగా రాక పొలాల కాడ మోటర్లు కాలిపోతున్నాయి. లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతున్నాయి. తెలంగాణ రాకముందు ఎట్లుండెనో&గిప్పుడు మల్లా గట్ల తయారైంది.
– వెంకట్స్వామి గౌడ్ రైతు, నస్కల్, నిజాంపేట మండలం
కోహీర్, జూన్ 20: నేను ఎనిమిది ఎకరాల్లో చెరుకు, అల్లం పంట పండిస్తున్నా. పంటలకు నీరు అందించేందుకు మూడు బోరు మోటర్లు ఉన్నాయి. లోవోల్టేజీ ఉండడంతో ఒకటే మోటరును నడిపిస్తున్నా. మూడు మోటర్లు ఒకేసారి నడిపిస్తే రెండు మోటర్లు కాలిపోతున్నాయి. అందుకే ఒక్క మోటరునే నడిపిస్తున్నా. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మళ్లీ కాంగ్రెస్ వచ్చినంక ఇబ్బందులు తప్పడం లేదు. కరెంట్ సక్కగా రాక బయిలకాడ మోటర్లు చూసుకోవడమే సరిపోతుంది.
– ప్రసాద్, రైతు, మనియార్పల్లి, కోహీర్ మండలం
కోహీర్, జూన్ 20: కరెంటు ఎప్పుడు వస్తుందో…ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు. నా చేను కాడ అల్లం పంట వేశా. పంటకు నీళ్లు పెడదామంటే మోటరు ట్రిప్ అవుతుంది. అసలు ఏమి జరుగుతున్నదో తెలియడం లేదు. అధికారులు ఎవరూ స్పందించరు. వారం రోజుల నుంచి వర్షం పడటం లేదు. పంటకు నీళ్లు పెడదామంటే కరెంటు సరిగా ఉండదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రంది లేకుండే. కాంగ్రెస్ వచ్చినంక మార్పు అంటే ఇదేనేమో&.ఆ పాలకులకే తెలియాలి. రైతులను పట్టించుకోకుంటే మాత్రం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.
– నర్సింహారెడ్డి, రైతు. గురుజువాడ, కోహీర్ మండలం
కొమురవెల్లి, జూన్ 20 : తెలంగాణ రాక ముందు కరెంట్ ఎట్లా ఉండేదో.. గిప్పుడు గట్లనే ఉంది. కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి అయినంకా ఏం కష్ట పడ్డడో ఏమోగానీ రైతులకు ఇబ్బందులు లేకుండా కరెంట్ ఇచ్చిండు. గిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ లెక్క ఎందుకు కరెంట్ ఇవ్వలేకపోతుందో సమాధానం చెప్పాలి. ఇంకా వానలు మొదలు కానేలేదు. ఎప్పుడైన చినుకు పడినా, కొమ్మ ఊగినా కరెంట్ పోతున్నది. ఎప్పుడు వస్తదో తెల్వదు&కేసీఆర్ సార్ను తిడుతున్న కాంగ్రెసోళ్లు ఆయన ఇచ్చినట్లు కరెంటు ఎందుకు ఇస్తాలేరు. కాంగ్రెస్ పాలనలో మాత్రం రైతులకు కరెంట్ కష్టాలు తప్పవు. మళ్లీ పాతరోజులే&బయిలకాడ ఉండక తప్పదు.
-మల్లం నర్సింహులు, రైతు, ఐనాపూర్, కొమురవెల్లి
ములుగు, జూన్ 20: బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే 24 గంటల కరెంట్ తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైంది. ఆ కృషి వెనుక అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టుదల ఎంతో ఉంది. తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల నుంచి 24 గంటలు కరెంటును చూసుడు కేసీఆర్తోనే సాధ్యమైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కరెంటు లేక, పంటలు పండక ఎంతో మంది రైతులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుండు. కానీ కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపి తెలంగాణలో రైతుల తలరాతలను మార్చిండు. మళ్లీ కాంగ్రెస్ వచ్చుడుతోఅప్పటి పరిస్థితులు దాపురించినయ్.
– చింతకింది కిష్టయ్య, ములుగు