గజ్వేల్, జూలై 2: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని, ఏడు మాసాలు గడిచినా పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆరోపించారు. మండలంలోని కొమటిబండ గ్రామానికి చెందిన ఉబ్బని అశోక్ కొద్ది రోజుల క్రితం నీట మునిగి మృతి చెందాడు. మృతుడికి పార్టీ సభ్యత్వం ఉండడంతో మంజూరైన రూ.2లక్షల ప్రమాదబీమా చెక్కును మంగళవారం మృతుడి భార్య పోశవ్వకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబద్ధపు, అసత్య ప్రచారాలతో ప్రజలను, రైతులకు కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 40వేల కోట్లు అప్పు చేసిందని, వాటిని ఏ సంక్షేమ పథకాలకు ఖర్చుచేశారో ప్రజలకు చెప్పాలన్నారు. మళ్లీ రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, పురుగుల మందు డబ్బాలతో రైతులు వీడియో చిత్రీకరించి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. పార్టీ కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, దేశంలోనే కార్యకర్తలకు ప్రమాదబీమా సౌకర్యాన్ని కల్పించి ఆదుకుంటుందన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోనే 350 మంది కార్యకర్తలు వివిధ కారణాలతో మృతి చెందితే వారికి రూ.7కోట్ల చెక్కులు అందజేశామన్నారు. రైతుబీమా ద్వారా ఆదుకోవడం జరుగుతుందన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, జడ్పీటీసీ మల్లే శం, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మధు, నాయకులు మద్దూరి శ్రీనివాస్రెడ్డి, రమేశ్గౌడ్, గొడుగు స్వామి, తూం శేఖర్, ఎల్లయ్య, చంద్రశేఖర్, అహ్మద్ పాల్గొన్నారు.
కొండపాక(కుకునూరుపల్లి), జూలై 2 : కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కొండపాక మండలంలోని దుద్దెడకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త జక్కుల మమత ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమెకు బీఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో రూ.2లక్షల ప్రమాదబీమా చెక్కు ను మంగళవారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ప్రతాప్రెడ్డి ఆమె భర్త అనిల్కు అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నూనె కుమార్యాదవ్, భారత జాగృతి రాష్ట్ర కార్యదర్శి అనంతుల ప్రశాంత్, రైతు బంధు సమితి మాజీ మండల కో ఆర్డినేటర్ ర్యాగల దుర్గయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు చిలుముల రామ్మోహన్, నాయకులు పెద్దంకుల శ్రీనివాస్గౌడ్, దోమల ఎల్లంయాదవ్, దొమ్మాట మహిపాల్రెడ్డి, గుండెల్లి ఆంజనేయులు, ఎలుక రాజిరెడ్డి, కోడెల మల్లేశం పాల్గొన్నారు.