సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 1 : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 68 మంది దరఖాస్తు చేసుకున్నారని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూకు సంబంధించినవి 46, డీఆర్డీవో 11, ఇతర శాఖలకు సంబంధించినవి 11 ప్రజావాణి దరఖాస్తులు అందాయని ఆమె తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన అర్జీలను వెం టనే పరిష్కరించాలన్నారు. అదనపు కలెక్టర్ మాధు రి, జిల్లా రెవెన్యూ అధికారి పద్మజారాణి, డీపీవో సాయిబాబా, డీఆర్డీవో పీడీ జ్యోతి, సంగారెడ్డి ఆర్డీవో వసంతకుమారి, అధికారు లు పాల్గొన్నారు.