సంగారెడ్డి, ఆగస్టు 1: రాజ్యాంగబద్ధమైన శా సనాలను తయారు చేసే శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా ఎమ్మెల్యేలను చూడకుండా అవమానపర్చడం సిగ్గుచేటని, సీఎం భేషరతుగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాలతో సంగారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి కొత్త బస్టాండ్ వరకు సీఎం దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై దహనం చేశారు. సీఎం డౌన్డౌన్ అం టూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకురాలు విజయలక్ష్మి మాట్లాడుతూ చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఎందుకు కల్పిస్తున్నారు, మహిళా ప్రజాప్రతినిధులను అవమానించేందుకా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించా రు. సభలో ప్రతిపక్ష నాయకులు అడిగిన వాటికి సమాధానం చెప్పలేకే దాటవేసే ధోరణికి పాల్పడుతూ మహిళా ఎ మ్మెల్యేలను అవమానపర్చడం సీఎం హోదాకు తగదని దుయ్యబట్టారు. ఏడు నెలల పాలనలోనే ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే’ అన్న చందంగా తయారైందని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు శాసనసభకు నల్లబడ్జీలతో హాజరైతే అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.
గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క రోజు కూడా మార్షల్స్తో సభ్యులను బయటికి పంపించిన దాఖలాలు ఉన్నాయా అని నిలదీశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం చేతకాక ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు సభలో ప్రతిపక్ష సభ్యులకు గౌరవం ఇవ్వని కాంగ్రెస్ సభ్యు ల తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. కార్యక్రమంలో శ్రావణ్రెడ్డి, గోవర్ధన్రెడ్డి, దిడ్డి విఠల్, రుక్ముద్దీన్, అజీమ్, చింటూ, సందీప్గౌడ్, పాం డుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేట, ఆగస్టు 1: మహిళా ఎమ్మెల్యేలపై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేసి అవమాన పర్చడం బాధాకరమని బీఆర్ఎస్ మహిళా విభాగం నాయకురాళ్లు ఆవేదన వ్యక్తం చేశా రు. అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు సబితాఇంద్రారెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, మహిళా, విద్యార్థి, యువజన విభా గం నాయకులు రాస్తారోకో నిర్వహించి సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మున్సిపల్ మాజీ మున్సిపల్ చైర్మ న్ రాజనర్సు, కౌన్సిలర్లు సుందర్, మల్లికార్జున్, కోఆప్షన్ సభ్యుడు సత్తయ్య, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రజనీకాంత్రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు యాదగిరి, నాయకులు మోయిజ్,శ్రీహరి, శ్రీనివాస్రెడ్డి, కనకయ్య, సాయిప్రేమ్, వెం కట్, రాజు, మహిళా విభాగం పట్టణ అధ్యక్షురాలు నరసమ్మ, మహిళా విభాగం నా యకురాళ్లు నరసవ్వ, అనిత, పద్మ, లక్ష్మి, నాగవ్వ తదితరులు పాల్గొన్నారు.