కొల్చారం, జూలై 2: రాంపూర్, కిష్టాపూర్, పోతంశెట్టి పల్లి, ఘనపూర్ గ్రామాల నుంచి కొల్చారం వస్తాం. స్కూల్, కాలేజ్ కలిపి రెండు వందల మంది దాకా ఉన్నాం. మాకు బస్సులు ఆప్తలేరు. పొద్దుగాల్ల టైంకు కలేజ్కి అందుతలేం. బస్సులు జనాలతో నిండడంతో డ్రైవర్, కండక్టర్లు మమ్ములనే తిట్టి దింపేస్తుండ్రు. సాయంత్రం కూడా లేట్ అయితాంది. బస్సుల్లా ఎక్కే గ్యారంటీ లేక ఇంకా బస్సు పాసులు తీయలే. బస్సులో ఎక్కనియ్యకపోతే ఆటోలో ఎక్కిపోతున్నం. స్కూల్ పిల్లలు సాయంత్రం లేట్ అయితే వాళ్ల దగ్గర డబ్బులు లేక తెలిసిన వాళ్ల దగ్గర పైసలు అడిగి ఆటోలో పోతుండ్రు. ఫ్రీ బస్ లేక ముందు ఇంత ఇబ్బంది లేకుండే.