పాపన్నపేట్, జూన్ 30 : మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గాభవానీ మాతను ఆదివారం పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీరానదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతను దర్శించుకున్నారు. పలువురు భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, కుంకుమార్చనలు ,తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ వినోద్రెడ్డి, ఏడుపాయల చైర్మన్ సతెల్లి బాలాగౌడ్, రవివీర్ కుమార్, సూర్యశ్రీనివాస్ ,మధుసూదన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, నర్సింహులు, వరుణాచారి, రాజు, యాదగిరి, శ్రీకాంత్ తదితరులు ఏర్పాట్లు చేశారు. వేదపండితులు శంకరశర్మ, పార్ధివశర్మ, మురళీధర్, రాజశేఖర్ పూజలు నిర్వహించగా పాపన్నపేట్ ఎస్సై నరేశ్ బందోబస్తు చేపట్టారు.