దుబ్బాక, జూలై 3: కరోనాను లెక్కచేయకుండా ప్రజాసేవలో అంకితమైన స్థానిక ప్రజాప్రతినిధుల సేవలు వెల కట్టలేనివని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్రావు కొనియాడారు. బుధవారం దుబ్బాకలోని రజనీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో దుబ్బాక నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఆత్మీయ సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, ఏఎంసీ చైర్మన్లను ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డితో కలిసి మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్రావు మాట్లాడుతూ ప్రజాసేవలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సేవలు చాలా గొప్పవన్నారు. రాజకీయాల్లో ఒడిదొడుకులు సహజమని, గెలుపోటములు శాశ్వతం కాదన్నారు. ఓటమి తర్వాత గెలుపు ఉంటుందని, రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ సర్కారేనని స్థానిక ప్రజాప్రతినిధులకు, బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన ధీమా కల్చించారు. పని చేసే నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో గుర్తింపుతోపాటు ప్రజల అండ ఉంటుందన్నారు. పదవికి విరమణ ఉంటుందని, ప్రజాసేవకు విరమణ ఉండదన్నారు. మీ సేవలను గుర్తు చేస్తూ ఎమ్మెల్యే ప్రభాకర్రెడ్డి ఆత్మీయ సన్మానం నిర్వహించడం అభినందనీయమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్నా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు జీతాలు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఉందని మండిపడ్డారు. కనీసం పారిశుధ్య కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. పల్లెలు మురుగు కుపాలుగా అస్తవ్యస్తంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ కోతలు, కరెంట్ కోతలు, సంక్షేమ పథకాల బంద్లు కొనసాగిస్తుందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడస్తున్నా దుబ్బాక నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధి జరుగలేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించడంతోపాటు ఎంపీ ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇచ్చినందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కృషి మరిచిపోలేనిదన్నారు. పదవీకాలం ముగిసినంత మాత్రాన ఆందోళన చెందవద్దని, ప్రజా సేవ చేసే నాయకులకు ప్రజాధరణ ఉంటుందన్నారు. సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమాలతో పల్లెల రూపురేఖలు మారిపోయాయని గుర్తు చేశారు. కేసీఆర్ సర్కారులో ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమం దేశానికే రోల్మోడల్గా నిలిచాయన్నారు. కాంగ్రెస్పై ప్రజల్లో విశ్వాసం పోయిందని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎమ్మెల్సీ యాదవ్రెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్సీగా ఎన్నుకునే విషయంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల సహకారం మరిచిపోలేనిదన్నారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి తనవంతుగా కృసి చేస్తానని హామీనిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ ఫరూక్హుస్సేన్ మాట్లాడుతూ అవినీతిపరులు, అక్రమార్కులు, ఆశా వాదులు మాత్రమే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లోకి పోతున్నారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మున్సిపల్ చైర్పర్సన్ గన్నే వనితాభూంరెడ్డి, దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనోహర్రావు, వెంకటనర్సింహారెడ్డి , రజనీకాంత్రెడ్డి, సతీశ్రెడ్డి, రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, నియోజవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పీఏసీఎస్, ఏఎంసీ చైర్మన్లు, మాజీ సర్పంచ్లు పాల్గొన్నారు.