వెల్దండ, జూన్ 30 : రైతాంగాన్ని కాంగ్రెస్ సర్కారు నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, రైతు భరోసాపై స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం వెల్దండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్రెడ్డి సర్కారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నదన్నారు. ఆరు గ్యారెంటీలతో పాటు ఇతర హామీలను విస్మరించి నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదన్నారు. ప్రభుత్వం ఏర్పడి న ఏడు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. రాష్ట్రంలో 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా.. అం దులో కోటి ఎకరాలు చిన్న సన్నకారు రైతులదే ఉన్నదన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ చేయాలన్నారు. ఎన్నికలకు ముందు రూ.15వేల రైతుభరోసా ఇస్తామని చెప్పి, ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. వలసల నివారణ కోసం కేసీఆర్ ప్రభుత్వం రైతుబంధు, 24 గంటల ఉచిత కరెంట్, రైతుబీమా వంటి పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. పంటకు పెట్టుబడి కోసం సాగుకు ముం దే రైతులకు రైతుబంధు సాయం అందించేదని వివరించారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమకారుడు స్కైలాబ్ తల్లి మృ తి చెందడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి , మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, నాయకులు పుట్టా రాంరెడ్డి, శేఖర్, విజయ్గౌడ్, మధుసూదన్రెడ్డి, చంద్రమోహన్రెడ్డి, నిరంజన్, న ర్సింహ, శ్రీను, ప్రసాద్, అశోక్, కొండల్యాదవ్ పాల్గొన్నారు.