మహబూబ్నగర్టౌన్, డిసెంబర్ 1 : శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ మహబూబ్నగర్ రీజియన్కు భారీ ఆదాయం వచ్చింది. నవంబర్ 29నుంచి 30వ తేదీ వరకు రూ.2కోట్ల 16వేల ఆదాయం రావడం విశేషం. రీజియన్ పరిధిలోని వనపర్తి రూ.32లక్షల 86వేల 689లతో అగ్రస్థానంలో ఉండగా, గద్వాల డిపో రూ.29లక్షల 63వేల 348లతో రెండోస్థానం, నారాయణపేట రూ.25లక్షల46వేల768లతో మూడో స్థానంలో నిలిచింది.
అచ్చంపేట రూ.25,22,952, నాగర్కర్నూల్ రూ.24,87,107, మహబూబ్నగర్ రూ. 22,38,930, కొల్లాపూర్ 19,50,194, కల్వకుర్తి రూ.18,57,424, షాద్నగర్ రూ. 12,65,531, కోస్గి రూ.1,99,078 ఆదాయం వచ్చినట్లు శుక్రవారం ఆర్ఎం శ్రీదేవి తెలిపారు. బస్టాండ్లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆమె పర్యవేక్షణ చేట్టారు. డీఎం సుజాత మహబూబ్నగర్ డిపో నుంచి హైదరాబాద్కు బస్సుల పర్యవేక్షణ చూశారు. శుక్రవారం సైతం ఆర్టీసీ డిపో ప్రయాణికులతో కిటకిట లాడింది. మరో రెండు మూడు రోజుల వరకు ప్రయాణికుల రద్దీ పెరిగి ఆర్టీసీకి మరింత ఆదాయం పెరగనున్నది.