సీఎం రేవంత్ సొంత జిల్లాలో నిరుద్యోగులు ఆందోళన బాట పట్టారు. నిత్యం ఏదో ఓ చోట నిరసన తెలియజేస్తున్నారు. వద్దురా నాయనా.. ఈ కాంగ్రెస్ పాలన మాకంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్నగర్, గద్వాలలో అన్ఎంప్లాయీస్ గళమెత్తారు. పెద్ద మొత్తంలో రోడ్డెక్కి ర్యాలీలు నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు. డీఎస్సీ పోస్టులు పెంచి గ్రూప్-1, 2 సన్నద్ధ మయ్యేందుకు సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసలు మెగా డీఎస్సీ ప్రకటిస్తారా..? లేదా..? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడు నెలలవుతున్నా ఇచ్చిన హామీలు అటకెక్కాయని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.