గద్వాల టౌన్, జూలై 4 ; బతుకు భరోసా.. మట్టిపైనే తన జీ వితం ఆధారం.. అందుకే మట్టితో రైతు కు విడదీయరాని బంధం ఉన్నది.. దీని ని ఎవరూ ఎప్పటికీ విడదీయలేనిది.. ఆ మట్టిని నమ్ముకునే తన బతుకు ప్రారంభిస్తాడు.. అదే మట్టిలో కలిసిపోతా డు.. అందుకే మట్టిని ఏటా రైతు ఏదో వి ధంగా పూజిస్తూనే ఉంటాడు.. అందు లో ఒకటి మట్టెద్దుల అమవాస్య’.. ఈ అ మావాస్యను ప్రతి ఏడాది జ్యేష్ఠమాసం లో చివరి అమావాస్య రోజున ఘనం గా జరుపుకొంటారు.. తమ కష్టసుఖా ల్లో భాగస్వాములైన ఎద్దులను మట్టితో తయారు చేసి పూజిస్తూ తమకు అండ గా ఉండాలని వేడుకుంటారు. అంతేగా క ఏడాది కాలం ఆ ఎద్దులను తమ పూజగదిలో పెట్టుకొని మరీ కొలుస్తుంటారు.
మనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేందుకు పండుగలు పబ్బాలు జరుపుకొంటాం. మిగతా రోజుల్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమై ఉంటాం. మన ప్రకృతి పంచభూతాత్మకమైనది. అంటే భూమి, గాలి, నీరు, అ గ్ని, ఆకాశంతో కూడుకున్నది. అందులో మ నం మొదటగా భూమాతకే అగ్ర తాంబూలం ఇస్తాం. ఆ భూ మాతపై ఆధారపడిన రైతు జాతికి వెన్నెముకలాంటివాడు. రైతులు తమ పశువుల్లోనూ వ్యవసాయ పనిముట్లలోనూ దైవాన్ని చూసుకుంటారు. అందులో భాగమే మట్టి ఎద్దుల అమావాస్య. వర్షరుతువు ఆరంభంలో జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను రైతులు ఏరువా క పున్నమిగా జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఇదే. తెలుగు సంవత్సరంలో మూడో మాసమైన జ్యేష్ఠమాసం అత్యంత ఫలప్రదమైనది. ఈ నెల తరువాత వచ్చే ఆషాఢమాసాన్ని శూన్యమాసం అంటారు. ఆషాఢం తరువాత వచ్చే శ్రావణ, భాద్రపద మాసాలు వర్ష రుతువులు ఎండల ప్రతాపాన్ని తగ్గించి వర్షాల ప్రారంభానికి సూచనగా జ్యేష్ఠమాసం లో వ్యవసాయానికి సంబంధించిన పనుల ను చాలా హడావిడిగా జరుపుతారు. అందు లో భాగంగానే జ్యేష్ఠ అమావాస్యను తెలంగాణ ప్రాంతంలో మట్టిఎద్దుల అమావాస్యగా వ్యవహరిస్తారు.
పండుగ జరుపుకొనే విధానం..
మట్టి ఎద్దుల అమావాస్య రోజు పిల్లలు పొలాల నుంచి మట్టిని తెచ్చి ఆ మట్టితో ఎ ద్దులను తయారు చేస్తారు. వాటికి రంగులు వేసి అందంగా అలంకరిస్తారు. అలాగే ఎద్దులు తినడానికి వేసే గాడ్పాటు ను కూడా ప్రత్యేకంగా అలంకరిస్తారు. అనంతరం మట్టి ఎద్దులను ఉంచి నైవేద్యాలు సమర్పించి ప్ర త్యేక పూజలు నిర్వహిస్తారు. తమ పంటలు మంచిగా పండాలని వేడుకుంటారు.
మట్టితో రైతుకు విడదీయని బంధం..
మట్టికి రైతుకు ఎన్నటికీ విడదీయలేని బందం ఉన్నది. మట్టితోనే తన జీవితాన్ని కొనసాగించి మట్టిలోనే కలిసిపోతాడు. అటువంటి బంధాన్ని చిన్నతనం నుంచే తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సం ప్రదాయాన్ని ప్రవేశపెట్టారని పెద్దలు చెప్తుంటారు. వాన చినుకు స్పర్శతో మట్టి, పల్లకీలో దీపంలా వెలిగిపోతుంది. మట్టి మన ఆశల్ని వమ్ముచేయదనే ఉద్దేశంతో మట్టిని ఎన్నో రకాలుగా రైతు పూజిస్తూనే వస్తున్నాడు. ఆ ఉద్దేశంతోనే మట్టి ఎద్దులను రైతులు పూజిస్తారు. తమ పిల్లలకు మనకు వచ్చే పంటలు, మన బతుకు మట్టి అని తెలిపేందుకే మట్టి ఎ ద్దులను పూజించే సంప్రదాయాన్ని పెద్దలు ప్రవేశపెట్టారని మరో కథనం కూడా ఉన్నది. తమకు వ్యవసాయంలో అన్ని విధాలుగా సహకరించే ఎద్దులకు కృతజ్ఞత భావంతో భక్తి శ్రద్ధలతో కలిగి ఉండాలని చెబుతుంది మట్టి ఎద్దుల అమవాస్య. ఎందుకంటే పూర్వకాలంలో ఒక రైతు దగ్గర ఎంత ఆదాయం ఉందనడానికి అతని దగ్గర ఉన్న పశుసంపదనేనని చెప్తుంటారు.
పండుగలకు పుట్టినిల్లు తెలంగాణ..
తెలంగాణ రాష్ట్రం ఎన్నో సంస్కృతు లు, సంప్రదాయాలకు పుట్టినిల్లు. తెలంగాణలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంస్కృతికి అద్దంపట్టే పండుగలు జరుపుకోవడం ఆనవాయితీ. వాటిలో కొన్ని పం డుగలు కనుమరుగు కాగా మరికొన్ని ఇప్పుడిప్పుడే ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. వాటిలో మట్టి ఎద్దుల అమావాస్య ఒకటి. ప్రస్తుతం ఈ పండుగను తెలంగాణ లో పూర్తిగా మరిచిపోయినా అక్కడక్కడ ఇం కా జరుపుకొంటూ తెలంగాణ సంస్కృతిని బతికిస్తున్నారనే చెప్పాలి. ముఖ్యంగా గద్వా ల, నారాయణపేట జిల్లాలో మట్టెద్దుల అ మావాస్యను ఘనంగా జరుపుకొంటారు. అలాగే కర్ణాటక రాష్ట్రం రాయచూర్లో మట్టెద్దుల అమవాస్యను వైభవంగా నిర్వ హించుకుంటారు. ఈ రోజున వినాయ క ప్రతిమల మాదిరి మట్టి ఎద్దులను తయారు చేసి పెద్ద ఎత్తున అమ్మకాలు జరుపుతారు. రైతులు ప్రతి ఇంటిలో మట్టి ఎద్దులను పెట్టుకొ ని పూజలు నిర్వహిస్తారు.