మూసాపేట, జూలై 3 : మూసాపేట మండలంలోని తుంకినీపూర్ గ్రామం జాతీయ రహదారి నుంచి 3 కిలోమీటర్లు, వేముల గ్రామం కూడా 2 కి.మీ. ఉంటుంది. గ్రామంలో కేవలం ప్రాథమిక పా ఠశాల మాత్రమే ఉన్నది. పైచదువులు చదవాలంటే ఇటు మూసాపేట, అటు వేముల గ్రామానికైనా వెళ్లాల్సింది. కానీ బస్సు సౌకర్యం లేకపోవడంతో ప్రతిరోజూ విద్యార్థులు ఉదయం, సాయంత్రం కాలినడకన వచ్చి వెళ్తుంటారు. అంతదూరం వెళ్లి రావాలంటే ఇబ్బందులు తలెత్తుతుండడంతో పాఠశాలలకు క్రమం తప్పకుండా వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. ఎలాగైనా తమ గ్రామం మీదుగా వేములకు బస్సు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు. అదేవిధంగా నందిపేట, దాసరిపల్లి, చక్రాపూర్, అచ్చాయిపల్లి, తాళ్లగడ్డ, తిమ్మాపూర్, పో ల్కంపల్లి, నిజాలాపూర్, మహ్మద్హుస్సేన్పల్లి తదితర గ్రామాల విద్యార్థుల పరిస్థితి కూడా అంతే. విద్యార్థులతో పాటు ఆయా గ్రామాల ప్రజలు వివిధ అవసరాల కోసం ప్రయాణం చే యాల్సి వస్తే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తున్నది. వాటితో ఎన్నో ప్రమాదాలు జరిగి వికలత్వం రావడంతోపాటు, ఆర్థికంగా కూడా నష్టపోతున్నారు. అందుకని ప్రభుత్వం ప్రతి గ్రామానికి బస్సు నడిపేలా సంబంధిత అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.