మక్తల్, జూన్ 30 : కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో సైనికుల్లాంటి కార్యకర్తలున్నారని, త్వరలోనే పార్టీ మరింత బలపడుతుందని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే చిట్టెం రా మ్మోహన్రెడ్డి స్వగృహంలో నిర్వహించిన స న్మాన కార్యక్రమానికి నవీన్కుమార్రెడ్డి హాజరై మాట్లాడారు. కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందన్నారు. ప్రాణాలకు తెగించి ఢిల్లీ నాయకుల మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బీడుభూములన్నింటికీ సాగునీరందిం చి పచ్చటి మాగాణులుగా మార్చారన్నారు. పదేండ్ల పాలనలో రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా మార్చిన గొప్ప నాయకుడని కొ నియాడారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని విమర్శించారు.
అధికారంలోకి వచ్చాక హామీలను విస్మరించి కా లయాపన చేస్తున్నదని మండిపడ్డారు. రేవంత్కు తన పదవిపై నమ్మకం లేక ఏం చేయాలో తెలియక రాష్ట్ర రైతాంగాన్ని కరెంట్ కష్టాల తో ఇబ్బంది పెడుతున్నారన్నారు. గత ప్రభు త్వం చేసిన అభివృద్ధిని చూసి ఓర్వలేక.. కేసీఆర్ అప్పులు చేశారని ప్రజలకు తప్పుడు మా టలు చెబుతూ పరిపాలన చేస్తున్నారని దు య్యబట్టారు. త్వరలోనే కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ మరింత బలపడి మరోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం చిట్టెం సమక్షంలో ఎమ్మె ల్సీ నవీన్కుమార్రెడ్డిని నాయకులు ఘనంగా సతరించారు. కార్యక్రమంలో ఊటూర్ జె డ్పీటీసీ అశోక్గౌడ్, మాగనూరు జెడ్పీటీసీ వెంకటయ్య, నాయకులు శ్రీనివాస్గుప్తా, కౌ న్సిలర్లు రాములు, మొగులప్ప, ఎంపీటీసీ లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.