నాగర్కర్నూల్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : చదువుకునేందుకు విద్యార్థులు నానా పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తున్నామని చెబుతున్నా రవాణా సౌకర్యం కల్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నది. దీనికి నిదర్శనం ఆటోలు, ట్రాక్టర్ల లాంటి వాహనాలను ఆశ్రయిస్తున్న విద్యార్థులే ప్రత్యేక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత విద్య ను అందిస్తామని ఓ వైపు ప్రకటనలు చేస్తున్నా విద్యాశాఖ స్వయంగా సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉన్నా ఆశించిన స్థాయిలో చర్యలు కన్పించడం లేదు. వి ద్యార్థులు ప్రాథమిక విద్యను పూర్తి చేసి ఉన్నత విద్య కోసం మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్తున్నారు. మరికొందరు తల్లిదండ్రులు ప్రాథమిక వి ద్య పట్టణాల్లోని ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు రవాణా సదుపాయం లేక నానా అగచాట్లు పడుతున్నారు. ఇప్పటికే చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు వెళ్లడం లేదు. ఆర్టీసీ సంస్థ రూట్ల ప్రకారంగా బస్సులు నడిపిస్తుంది. దీని వల్ల ఆయా రూట్ల మీదుగా ఉండే ముఖ్య పట్టణాల మార్గాల్లో ఉండే గ్రామాలకు మాత్రమే అధికంగా బస్సులు వెళ్తున్నాయి. ఆయా రూట్ల నుంచి లోపలికి ఉండే గ్రామాలకు బస్సులే వెళ్లడం లేదు.
ఆర్టీసీ సంస్థ అన్ని రూట్ల ప్రకారం బస్సులు నడిపిస్తున్నామని చెబుతున్నా మండలాల వారీగా 70 నుంచి 80శాతం గ్రామాలకు బస్సులు నడిపించడం లేదు. నియోజకవర్గ కేంద్రం, మండలాలను మినహాయిస్తే మిగిలిన మండలాల్లో ఇవే పరిస్థితు లు ఉన్నాయి. పాఠశాల సమయాలో బస్సులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నా రు. పాఠశాలకు సమయానికి చేరుకోవడంతోపాటుగా సాయంత్ర వేళల్లో ఇంటికి వెళ్లేందుకు ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఎ క్కుతుండడంతో విద్యార్థుల కోసం వేసిన బస్సు లు సైతం రద్దీగా మారుతున్నాయి. దీంత్లో బస్సు లో ఎక్కిన విద్యార్థులు నిలబడి గమ్యస్థానాలకు చే రుకుంటున్నారు. ముఖ్యంగా బాలికలు మహాలక్ష్మి పథకానికి దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయం గా ఆటోలకు చార్జీలు చెల్లిస్తున్నారు. ఇంకా ఆర్టీసీ సంస్థ బస్సు పాసులను కూడా ప్రారంభించలేదు. ఈ కారణంగా విద్యార్థులు చార్జీలు చెల్లించి పాఠశాలలకు చేరుకుంటున్నారు. కళాశాలలో చదివే వి ద్యార్థులు త్వరగానే రావడంతోపాటు సాయంత్రం ఆలస్యంగా వెళ్లడం వల్ల ఆయా సమయాల్లో బస్సు లు లేక ఆటోల్లో వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొందరు తల్లిదండ్రులు సమీప పట్టణాలకు తీసుకొచ్చి తీసుకెళ్తున్నారు. బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో బస్టాండ్లో సాయంత్రం పాఠశాలలు విడిచినప్పుడు పెద్దసంఖ్యలో బస్సు ఎక్కేందుకు విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. ప్రమాదకరంగా ఉన్నా తప్పనిసరిగా విద్యార్థులు బస్సుల వెంట పరుగులు పెడుతున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, పెంట్లవెల్లి, కోడేరు, లింగాల, పదర తదితర మండలాల్లోని చాలా గ్రామాల్లో బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోనే అమ్రాబాద్, పదర మండలాల్లోని గ్రామాల్లోకి బస్సులు వెళ్లడం లేదు. జొన్నంరెడ్డిపల్లి, తుర్కపల్లి, వెంకటేశ్వర్లబావి, గంగనోనిపల్లి, లక్ష్మాపూర్, ఎన్నంపల్లి, కొత్తపల్లి, కలుములోనిపల్లి, ఎలమపల్లి, లింగాల మండలం వంకితండా, జేసీతండా, జీలుగుపల్లి, కొత్తగుట్టపల్లి, వడ్డె రాయవరం, కొల్లాపూర్ మండలంలోని ఎర్రగట్టు బొ ల్లారం, ఎల్లూరు చెంచుగూడెం, పెంట్లవెల్లి మండలంలోని తడకలవారికొండ, మంచాలకట్ట, బల్మూ రు మండలం కుల్లంపల్లి, కోనేటిపూర్, తుమ్మలప ల్లి, రంగాపూర్కొండ, తాడూరు మండలం పొల్మూ రు, గుట్టలపల్లి, అల్లాపూర్, చర్లఇటిక్యాల, లచ్చిరాంతండా, తెలకపల్లి మండలం పర్వతాపురం, దాసుపల్లితో పాటు తదితర గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. ప్రభుత్వం స్పందించి విద్యార్థుల కోసం అదనంగా పాఠశాల సమయాల్లోనే బస్సులు నడపాల్సిన అవసరం ఉన్నది.
మాది తెలకపల్లి మండలం వల్లభాపూర్ గ్రామం. మా గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో ఉన్నత చదువుల కోసం తెలకపల్లి, నాగర్కర్నూల్ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తున్నది. ఆర్థికంగా ఉన్న వారు ఆటోల్లో ప్రయాణిస్తుంటే ఆర్థిక స్థోమతలేని మాలాంటి విద్యార్థులు కాలినడకన తెలకపల్లికి చేరుకుంటున్నారు. వల్లభాపూర్ నుంచి రాంపూర్ స్టేజీ వరకు నిత్యం నడుచుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఏదైనా బస్సులో తెలకపల్లికి చేరుకుంటున్నాం. నాతోపాటు చాలా మంది విద్యార్థులు బస్సు కోసం అవస్థలు పడుతున్నారు. సమయానికి పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాలనే ఉద్దేశంతో ఆటోల్లో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఉదయం, సాయంత్రం రెండు కిలో మీటర్ల పైబడి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలలు, కళాశాలల సమయానికి బస్సులు నడిపించాలి.
కాలేజీకి పోవాలంటే మా గ్రామానికి ఆర్టీసీ బస్సు రాక నిత్యం అవస్థలు పడుతున్నాం. డాకుతండా నుంచి లట్టుపల్లి వరకు రోజూ నడిచి వస్తున్నాం. లట్టుపల్లి గ్రామానికి కూడా ఆర్టీసీ బస్సులు రావడం లేదు. కళాశాలకు వెళ్లాలంటే ఆటోలు, ఇతరుల బైక్లపై లిఫ్ట్ అడిగి వెళ్లాల్సి వస్తుంది. ఎన్నిసార్లు డిపో మేనేజర్కు విన్నవించుకున్నా బస్సులు నడిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి లట్టుపల్లితోపాటు గ్రామ పరిధిలోని 18 తండాలకు బస్సు సౌకర్యం కల్పించాలి.
నాగర్కర్నూల్ జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. నాది కుమ్మెర గ్రామం. బడికి వచ్చే బస్సు నిండిపోయి ఉంటుంది. రోజూ ఒకటే బస్సు వస్తుంది. నిలబడేందుకు కూడా చోటు ఉండడం లేదు. బడికి లేటవుతుంది. ఇంటికి వెళ్లేటప్పుడు ఈ బస్సు పోతే మరో బస్సు లేకున్నా.. నిలబడే వెళ్తున్నాం.
నాగర్కర్నూల్లోని హైస్కూల్లో చ దువుకుంటున్నా. మా ఊరికి ఒకే బస్సు వస్తుంది. సాయంత్రం స్కూల్ విడిచే వరకు బస్సు వెళ్లిపోతుంది. అందుకే రోజు నాగర్కర్నూల్ నుంచి ఆటోలో ఊరికి వెళ్తాను. సాయంత్రం వేళల్లో కూడా బస్సు ఉంటే బాగుంటుంది.
మాది చర్లతిరుమలాపూర్, నాగర్కర్నూల్లో చదువుకుంటాను. సాయం త్రం బడి నుంచి వచ్చే టైంకు బస్సు ఉండదు. బస్సు పాసులు కూడా ఇంకా ఇయ్యలేదు. అందుకే ఆటోలు, బస్సు ల్లో చార్జీలు ఇచ్చి వెళ్తున్నాం.- సా