తెలంగాణ రాకముందు రాత్రి, పగలు తేడా లేకుండా కరెంట్ కోతలుండేవి. రాత్రింబవళ్లు బావులకాడికి పోయి చేన్లకు నీళ్లు పారిచ్చేటోళ్లం. పంటలు ఎండిపోతుంటే ధర్నాలు కూడా చేసినం. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఆ పరిస్థితి లేదు. కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తానని చెప్పినట్టుగానే ఇచ్చిండు. మన దగ్గర సరిపోయేంత కరెంట్ లేకపోతే వేరే రాష్ర్టాల నుంచి కొని ఇచ్చిండు. దాంతో పొద్దుందాకనే చేన్లకు నీళ్లు పారిచ్చుకున్నాం. పదేండ్ల కేసీఆర్ పాలనలో ఏరోజు కూడా రాత్రిపూట బాయికాడికి పోయి నీళ్లు పెట్టలే. తెలంగాణ వచ్చినంకనే సరిపోయేంత కరెంట్ వచ్చింది. కరెంట్ లేక పంటలు ఎండిపోయిన ఘటనలు అయితే లేవు. పదేండ్లు కరెంట్, నీళ్లకు ఢోకా లేకుండా పంటలు పండించుకున్నం. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయం చేద్దామంటే భయమయ్యేలా చేస్తున్నది. కరెంట్ ఎప్పుడు వస్తదో? ఎప్పుడు పోతదో తెలుస్తలేదు.
కరెంట్ ఉంటేనే మా పనులు సాగుతయి. అది సక్కగుంటలేదు. పోతే ఎప్పుడొస్తదో తెల్వదు. సారోళ్లకు ఫోన్ చేస్తే పైనుంచి పోయిందని చెప్తున్నరు. పనులేమో ఆగిపోతున్నయి. మా సంపాదనంతా కరెంట్ పైనే ఆధారపడి ఉంది. కరెంట్ లేక వచ్చినోళ్లంతా వెనక్కిపోతున్నరు. చాలా ఇబ్బందులు పడుతున్నం. అప్పుడు (బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ) కరెంట్ మంచిగుండే. అస్సలు పోకపోయేది. మా పనులు ఆగేవి కాదు. కాంగ్రెస్ వచ్చినాకనే మాకు తిప్పలు మొదలయ్యాయి. ఈ కష్టాలు ఎప్పుడు తీరుతయో..
2014కు ముందు చిన్నంబావి మండలం అస్తవ్యస్తంగా ఉండే. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కేసీఆర్ సార్ మండలంగా ప్రకటించిండు. అంతేకాకుండా సాగునీటిని తీసుకొచ్చిండు. మండల రైతాంగానికి సాగునీరు, ఉచిత కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. రాత్రిపూట కరెంట్తో ప్రమాదాలు జరుగుతాయని, ఉదయం పూట కూడా సరఫరా చేసి మర్చిపోలేని సాయం చేసిండు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అన్నదాతలు విషపురుగులు బారిన పడడం, విద్యుత్ షాక్లకు గురికావడం నిలిచిపోయాయి. రైతులు ఆయనను ఎప్పుడూ మరిచిపోరు. మంచి చేసిన కేసీఆర్పై నిందనలు వేయొద్దు. ప్రస్తుత ప్రభుత్వం మళ్లీ పదేండ్ల కిందటి పాలనను గుర్తుకు తెస్తున్నది. పంటలు పండుతాయన్న నమ్మకమైతే లేదు.