మహబూబ్నగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ; తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో కరెంట్ కాంతులు ప్రసరిస్తే.. కాం గ్రెస్ పాలనలో ‘కట్’కట మొదలైంది. ఎడాపెడా కోతలపై ప్రజలు, వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ పని సక్రమంగా చేయలేకపోతున్నామని, కరెంట్ ఉంటేనే అన్ని పనులు అవుతాయని చెబుతున్నారు. ప్రస్తుతం సరఫరా అ య్యే కరెంట్తో బోరు మోటర్ ద్వారా నీళ్లు ఎకరా పొలం కూడా పారడం లేదని కర్షకులు వాపోతున్నారు. బీఆర్ఎస్ పాలనలోనే నాణ్యమైన కరెంట్ వచ్చేదని, ఇందుకు కారణమైన కేసీఆర్ను బద్నాం చేయాలని చూడడం సరికాదన్నారు.
గిరాకీ వాపస్ పోతుంది..
ఈ ఆర్నెళ్లుగా కరెంటు కోతలు ఎక్కువైనయ్. కొత్త గ వర్నమెంట్ రాకముందు బాగుండె. పొద్దస్తమానం కరెం టే అస్సలు పొయ్యేదికాదు. ఎప్పుడన్నా పోయినా వెం టనే వచ్చేది. వ్యాపారం కూడా మంచిగా సాగేది. ఇప్పుడేమో ఎప్పుడు పోతదో.. ఎప్పుడు వస్తదో తెలుస్తలేదు. కేసీఆర్ సారు ఎట్లిచ్చిండో కానీ ఇప్పుడైతే అప్పటిలాగ ఇస్తలేరు. గంట గంటకూ కరెంటు పోతుంటే గిరాకీ వాపస్ పోతుంది. ఇన్ని రోజులు జనరేటర్ అవసరం లేకుం డె. అర్జెంట్ ఉన్నప్పుడు జనరేటర్ను పెట్టుకొని జిరాక్స్ లు తీయాల్సి వచ్చింది. గిరాకీ పోవొద్దని జనరేటర్ పెట్టి జిరాక్స్ తీసిచ్చినా కస్టమర్ ఇచ్చేది రెండ్రూపాయలే. జనరేటర్ పెట్టినందుకు రూపాయి ఎక్కువ ఇవ్వమన్నా ఇవ్వరు.
గిరాకీని వాపసు పంపలేక తిప్పలు పడుతున్న. జనరేటర్ పెట్టి వ్యాపారం చేయలేం. పదేండ్లకు ముందు వ్యాపారాలు చేసిన రోజులు గుర్తొస్తున్నయ్. ఇట్లే ఉంటే వ్యాపారం చేయడం కష్టమైతది. చాలామంది కరెంటును నమ్ముకునే వ్యాపారాలు చేసుకుంటరు. వాళ్లంతా ఇబ్బంది పడే పరిస్థితులొస్తయి. అప్పటి పరిస్థితులు తలుచుకుంటేనే భయమైతుంది. టైంకు కరెంట్ లేక వ్యాపారాలు లేక, షాపులు మూసేసుకునేటోళ్లం. తెలంగాణ వచ్చినంక కరెంట్ తిప్పలు తప్పినయ్ కానీ.. కాంగ్రెసోళ్లు వచ్చినంక పరిస్థితి దారుణమైంది. పరిస్థితులు ఇట్లే కొనసాగితే వ్యాపారాలు, పరిశ్రమలు నడపలేం. వాటిని నమ్ముకునే చాలామంది బతుకుతున్నరు. పని ఇచ్చేవారు లేకపోతే చాలామంది కార్మికులు రోడ్డున పడాల్సి వస్తది. కేసీఆర్ ప్రభుత్వాన్ని తిట్టడం మానేసి ఏం చేస్తే 24 గంటల కరెంట్ ఇవ్వగలమని సీఎం ఆలోచిస్తే బాగుంటుంది.
– శశిధర్, జిరాక్స్ వ్యాపారి, ఆత్మకూరు, వనపర్తి జిల్లా
24 గంటల కరెంటిచ్చింది కేసీఆరే..
వ్యవసాయంపై రేవంత్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడి రైతులను మోసం చేస్తున్నడు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూడుగంటల కరెంట్తో మూడు మడులు కూడా పారకుండే. మళ్లీ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వచ్చింది. ఉన్న పంటలన్నీ ఎండిపోత యి. వ్యవసాయం చేసే నాయకుడు కేసీఆర్కు కరెంట్ లేకపోతే ఎ ట్లుంటదో తెలుసు. మూడుగంటల కరెంట్ చాలనే రేవంత్కు మా క ష్టాలెట్లా తెలుస్తయ్. సీఎం రేవంత్ రైతుల గురించి నీచంగా మట్లాడి తే బాగోదు. రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. కాంగ్రెస్ రావడంతో మాకు మళ్లీ పాత రోజులొచ్చాయి.
– కొండారెడ్డి, రైతు, మరికల్, నారాయణపేట జిల్లా
లేనిపోని ఆరోపణలు చేస్తున్నరు..
సాగునీటి కోసం బావులకాడనే పండుకుని పంటలకు నీళ్లు పెట్టెకునేటోళ్లం. కరెంట్ ఎప్పుడొస్తుందో? ఎప్పుడు పోతుందో? తెలిసేది కాదు. సమయం, సందర్భం లేకుండా కరెంట్ కోతలుండేవి. సక్రమంగా సరఫరా చేయకపోవడంతో మోటర్లు, ట్రాన్స్ఫారం కాలిపోతుండే. కరెంట్ సరిగా లేక చేతికొచ్చిన పంట పూర్తిగా ఎండిపోయి.. చేసిన అప్పులు తీరక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తెలంగాణ వచ్చినంక అప్పటి సీఎం కేసీఆర్ రైతు బాధలు తెలుసుకొని 24 గంటల కరెంట్ ఇచ్చిండు. నిరంతరం కరెంట్తో మూడు పంటలు సాగు చేసినం. రాత్రి పూట ఇంటికాడ పడుకొని పగటి పూట పంటలకు నీళ్లు పారించినం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక పాత రోజులు గుర్తొస్తున్నాయి. అన్నదాతకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచిన కేసీఆర్పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. నిరంతరం కరెంట్ ఇచ్చిన కేసీఆర్ను తప్పుపట్టడం అన్యాయం.. మళ్లీ కేసీఆర్ వస్తేనే మా బతుకులు మారుతయ్.
– బిట్ల ధర్మారెడ్డి, రైతు, మర్రిపల్లి, చారకొండ మండలం , నాగర్కర్నూల్ జిల్లా
కాంగ్రెస్ పాలనలో గోస పడుతున్నం..
మాకు కరెంటు సరిగ్గా వస్తలేదు. గాలి, వర్షం వస్తే రాత్రిపూట కరెంటు ఉండదు. నీళ్లు వస్తలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ పోకపోయేది. నీళ్లు మంచిగా వచ్చేవి. రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంటిచ్చిండు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో కరెంట్ కష్టాలు స్టాటైనయ్. కరెంట్ రాత్రిపూట వస్తే పొలాల్లో పడుకునే పరిస్థితి వచ్చేటట్లుంది. మాది నల్లమల అటవీ ప్రాంతంలోని పల్లెరూటుపెంట. మా పెంటలో 40 గుడిసెలున్నా యి. కొన్ని నెలలుగా మిషన్ భగీరథ నీళ్లు కూడా వస్తలేవు. ఒక్కోసారి వారం వరకు కరెంట్ ఉండదు. చాలా గోస పడుతున్నం.
– అంజమ్మ, పల్లెరూటుపెంట, అచ్చంపేట, నాగర్కర్నూల్ జిల్లా
మొదలైన కరెంట్ కష్టాలు
కాంగ్రెస్ పాలన అంటేనే కరెంట్ కష్టాలు ఉంటాయి. పదేండ్ల కిందటి వరకు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ఎన్నో కష్టాలు పడ్డాం. పగలు, రాత్రి తేడా లేకుండా పొలాల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాసినం. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినంక కరెంట్ కష్టాలు తీరాయి. కేసీఆర్ ప్రభుత్వం రైతులకు 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో రెండు పంటలు సాఫీగా సాగు చేసుకున్నాం. కానీ ప్రస్తుతం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కరెంట్ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. దీంతో బోరు బావుల వద్ద నాట్లు వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నాం.
– రాజేశ్వర్రెడ్డి, రైతు, రాకొండ, మరికల్ మండలం, నారాయణపేట జిల్లా