నారాయణపేట, జూన్ 30 : కేసీఆర్ నాయక త్వంలో దమ్మున్న బీఆర్ఎస్ వెంటే ఉంటానని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.రాజేందర్రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీకి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ మారన న్నారు. సీఎం సొంత జిల్లాలోనే తాను ఎమ్మెల్సీగా గెలిచానని.. ఎన్ని డబ్బులున్నా.. అధికారం ఉన్నా నిజాయితీకి తలొగ్గాల్సిందేనని స్పష్టం చే శారు. కాంగ్రెస్ నాయకులు పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతూ రాజకీయాలు చేయడం మానుకొని, అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై తప్పకుండా శాసనమండలిలో ప్రస్తావిస్తానన్నారు. ఒ కవేళ జిల్లాలను రద్దు చేయాలని ప్రభుత్వం భా విస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామన్నారు. ఎ మ్మెల్సీ నిధుల కేటాయింపులో పేటకు ప్రాధాన్యమిస్తామన్నారు. సీఎం తమ్ముడికి ఎలాంటి హో దా లేకున్నా కల్యాణలక్ష్మి చెకులను పంపిణీ చేస్తుంటే ధైర్యంగా అడ్డుకున్న దౌల్తాబాద్ జెడ్పీటీసీ మహిపాల్రెడ్డిని అభినందించారు.
కాంగ్రెస్ అంటేనే 12 మంది సీఎంల జట్టు అని.. ఎంపీ ఎ న్నికల ఫలితాల తర్వాత సీఎం బలహీనత అ ర్థమై ఆ పార్టీలో వర్గ విబేధాలు మొదలయ్యాయన్నారు. పాలమూరు ప్రజలు ఎంతో విశ్వాసం ఉ న్నవారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో రి యల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయిందన్నారు. కష్ట కాలంలో పార్టీకి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానన్నారు. తెలిసీ తెలియక పార్టీ వీడిన వా రు తిరిగి రావాలని కోరారు. అనంతరం రాజేందర్రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ విజయానికి ప్ర త్యక్షంగా, పరోక్షంగా కృషి చేసిన వారికి కృతజ్ఞత లు తెలిపారు. పాలమూరు ఎంపీగా కేసీఆర్ గెలవడం వల్లే రాష్ట్రాన్ని సాధించుకున్నామని.. మహబూబ్నగర్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెలుపొందడంతో పార్టీకి పూర్వవైభవం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. పీఆర్ఎల్ఐ, జిల్లాల రద్దు విషయంపై ఉమ్మడి జిల్లా తరఫున వాణి వినిపించాలని కోరారు. అనంతరం నవీన్కుమార్రెడ్డిని రాజేందర్రెడ్డితోపాటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీ లు, కౌన్సిలర్లు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ సురేఖ, ఎంపీపీలు నర్సప్ప, శ్రీనివాస్రెడ్డి, శశికళ, జెడ్పీటీసీలు అంజలి, లావణ్య, విజయ్సింహారెడ్డి, కౌన్సిలర్లు గురులింగ్, శిరీషాచెన్నారెడ్డి, నాయకులు విజయసాగర్, వెంకట్రెడ్డి, సుదర్శన్రెడ్డి, ప్రతాప్రెడ్డి, జగదీశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.