నాగర్కర్నూల్, జూన్ 29 (నమస్తే తెలంగా ణ) : పచ్చదనం పరిఢవిల్లేలా చేసేందుకు కేసీఆ ర్ ప్రభుత్వం అమలు చేసిన హరితహారంపై రా ష్ట్ర సర్కారు శీతకన్ను వహిస్తున్నది. వర్షాకాలం వచ్చినా హరితహారం నుంచి వనమహోత్సవానికి పేరు మారిందే తప్పా మొక్కలు నాటే కా ర్యాచరణ ఎక్కడా కనిపించడం లేదు. ముసురు పడుతున్న క్రమంలో మొక్కలు నాటితే జూలై లో పూర్తిస్థాయి వర్షాలు కురిసే నాటికి ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. కాగా కార్యాచరణ లేకపోవడంతో అధికారులు ఏర్పాట్లు చేసి ప్ర భుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తుండడం గమనార్హం.
నర్సరీల్లో మొక్కలు.. భూమిపైకి వచ్చేదెప్పుడో..?
హరితహారంపై ప్రభుత్వ ఉదాసీన వైఖరి అవలంభిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటవీ శాతాన్ని 33 శాతం పెంచేందుకు 2015లో సీఎం కేసీఆర్ అమల్లోకి తీసుకొచ్చిన ఈ పథకంతో గతేడాది వరకు నాగర్కర్నూల్ జిల్లాలో 5 కోట్ల మొక్కలను నాటడం విశేషం. ఇలా ప్రతి ఏడాది హరితహారం కార్యక్రమం నాటి నుం చి పండుగలా జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆరు నెలల కిందట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం హరితహారాన్ని పట్టించుకోవడం లేదు. తొలి సీఎం కేసీఆర్ పెట్టిన హరితహారం పేరును వనమహోత్సవం గా మార్చింది. కానీ మొక్కలు నాటే కార్యాచరణ మా త్రం ప్రారంభించలేదు.
వానకాలం రావడంతో అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఇక మొక్కలు నాటేందుకు డీఆర్డీవో శాఖ చర్యలు చేపట్టింది. పదేళ్లలో నాటిన లక్ష్యానికి భిన్నంగా తక్కువ సంఖ్యలో నా టేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలో గ్రామాల్లోని నర్సరీల్లోనూ తక్కువ సంఖ్యలోనే మొక్కలను పెం చగా.. నేడు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇందుకోసం జిల్లాలో 4 లక్షల మొక్కలు నాటేందుకు గుంతలను తీశారు. ఇలా ఓవైపు హరితహారం పేరుమారి ప్రా రంభానికి సమయం వచ్చినా ప్రభుత్వ కార్యాచరణ మాత్రం సాగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతం లో ప్రతి ఏడాది కోటికిపైకా మొక్కలు నాటారు. గత ప్రభుత్వం అమలు చేసిన పథకాలపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నది. దీనికి నిదర్శనం గతంలో రోడ్ల వెంట నాటిన మొక్కలు ఎండిపోతుండగా.. పలు చోట్ల గొడ్డలి వేటుకు గురవ్వడమే.
పథకం ప్రారంభమైన 2015లో తక్కువగా 35 లక్ష ల మొక్కలు నాటగా ఆ తర్వాత ఈ సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ, ప్రస్తుత ఏడాది కేవలం 23 లక్షల మొ క్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం జిల్లాలోని 461 గ్రామ పంచాయతీల్లో 36 లక్షల మొక్కలను వచ్చే హరితహారానికి పెంచేలా నర్సరీలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాస్థాయిలో అధికారులు మాత్రం సమీక్షలతోనే సరిపెడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలు వస్తే ఆచరణలో ముందుకు సాగే అవకాశం కనిపిస్తున్నది.
ప్రభుత్వ ఆదేశం మేరకే..
అటవీ శాతాన్ని పెంచేందుకు హరితహారం ప థకం అమలవుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 5 కోట్ల వరకు మొక్కలను నాటాం. ఈ ఏడాది 23 లక్షల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేయగా.. నర్సరీల్లో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. జిల్లాలో 4లక్షల గుంతలను తీశాం.. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే నాటేందుకు ఏర్పాట్లు చేస్తాం.
– చిన్న ఓబులేసు, డీఆర్డీవో, నాగర్కర్నూల్