వనపర్తి, జూలై 1 : వైద్యులంటే.. పునర్జన్మనిచ్చే ప్రదాతలని, వారిని గౌరవించుకోవడం అందరి బాధ్యతని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వైద్యుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రజావైద్యశాలలో డాక్టర్లు మురళీధర్, శారదతోపాటు ప లువురిని నిరంజన్రెడ్డి సన్మానించారు. అదేవిధంగా బాలకిష్టయ్య విగ్రహానికి నివాళులర్పించి మాట్లాడారు. వైద్యు లు ప్రత్యక్ష దైవంతో సమానమని, రోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపి వారి ఆరోగ్యాన్ని మెరుగు పర్చుతారన్నారు. నియోజకవర్గంలో వైద్య సేవలు అందుబాటులోని లేని సమయంలో డాక్టర్ బాలకిష్టయ్య ప్రజలకు విశేష సేవలందించారన్నారు. అలాగే ఉద్యోగ విరమణ సందర్భంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ యుగంధర్రెడ్డి, శ్రీదేవి దంపతులను సన్మానించారు. ఉద్యోగ విరమణ అనంతరం సమాజ సేవకు అంకితం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, జాత్రునాయక్, అశోక్, నాగన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు.