మహబూబ్నగర్ టౌన్, జాలై 4 : రీజియన్ పరిధిలో మహబూబ్నగర్ డిపో రాష్ట్ర ఉత్తమ డిపోగా ఎంపికైం ది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.24.10కోట్ల అధికలాభం ఆర్జించినందుకుగానూ రాష్ట్రంలో మహబూబ్నగర్ డిపో మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో సత్తుపల్లి, మూడో స్థానంలో ఇబ్రాహీపట్నం డిపో నిలిచింది. రీజియన్లోని వివిధ డిపోల్లో పనిచేసిన ఉద్యోగులు డి.శాంతయ్య, కృష్ణయ్య, ఎన్ఎస్ఆర్ ప్రసాద్లు ప్రగతిచక్రం వార్షిక పురస్కారాలు అందుకున్నారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్లోని టీఎస్ఆర్టీసీ కళాభవన్లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా ఆర్ఎం శ్రీదేవి, డిపో మేనేజర్గా సుజాత రూ.3లక్ష క్యాష్ అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. కార్పొరేషన్ ఇచ్చిన సంక్రాంతి ఛాలెంజ్లో రీజియన్లో 10 మంది కండక్లర్లు, 10 మంది డ్రైవర్లు, దసరా ఛాలెంజ్లో 10 కండక్లర్లు, 8 మంది డ్రైవర్లు, అదేవిధంగా ఆఫీసర్స్ కేటగిరిలో అంజనేయులు (నారాయణపేట), శ్రీనివాస్ (గద్వాల), ఉష(షాద్నగర్), ధరమ్సింగ్(నాగర్కర్నూల్), శ్రీకాంత్(కల్వకుర్తి), రాజేశ్వర్, పరమేశ్వర్(వనపర్తి) డిపోల నుంచి రాష్ట్రస్థాయి పురస్కారాలు అందుకున్నా రు. సంస్థ అభ్యున్నతి కోసం ఉద్యోగులు ఎంతో కృషి చేస్తున్నారని ఆర్ఎం శ్రీదేవి తెలిపారు.
రాష్ట్రంలో కిలోమీటర్కు ఆదాయాన్ని సాధించడంలో వనపర్తి డిపో రెండోస్థానంలో నిలిచిందని డిపో మేనేజర్ పరమేశ్వరి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ చేతులమీదుగా మెమెంటోలు, అభినందనలు పొందినట్లు పేర్కొన్నారు. డిపో మేనేజర్ పరమేశ్వరి, కండక్టర్ బస్వరాజ్, బి.ఆర్ రెడ్డి, సీఐ ఎం.కృష్ణయ్య, డ్రైవర్లు కొండారెడ్డి, ఎం.ఖలీద్లు ఎక్కువ ఆదాయం తీసుకువచ్చినందుకు ఎండీ చేతులమీదుగా అవార్డులు పొందారన్నారు.