మహబూబ్నగర్, జూలై 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసలే పేద విద్యార్థులు.. చదువుకునే ఆకాంక్షతో మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో సర్కారు బడు ల్లో చదువుతున్నా.. సమయానికి గ్రామాల నుం చి బస్సులు లేక అవస్థలు పడుతున్నారు.. 8:45 గంటలకు స్కూల్కు రావడానికి పొ ద్దున్నే ఐదు గంటలకు లేచి.. టిఫిన్ బాక్స్ చేతిలో పట్టుకొని బరువు పుస్తకాలతో కాలినడకన బయలుదేరుతున్నారు.. ఆటోలు, ప్రైవే ట్ వాహనాల్లో వెళ్లేందుకు స్థోమత లేక కిలోమీటర్ల కొద్దీ కాలినడకన పాఠశాలలు, కళాశాలలకు వస్తున్నారు. ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ఈ పరిస్థితి దాపురించింది.. కొత్త సర్కారు అధికారంలోకి వచ్చాక మ హిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడంతో విద్యార్థులకు బ స్సులు దూరమయ్యాయి. సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు ఉదయం, సాయం త్రం కాలినడకన బయలుదేరి పట్టణాలకు చేరుకొని చదువుకుంటున్నారు.
రాత్రి అయితే కాళ్ల నొప్పులతో బాధపడుతూ తల్లిదండ్రులకు చెప్పుకొని ఏడుస్తున్నారు.. ఇది నిత్యకృత్యమైంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 8 ఆర్టీసీ డిపోల్లో ఉన్న పల్లె వెలుగు బస్సులు సమయానికి రాకపోవడం తో వేలాది మంది విద్యార్థులు తమ గమ్యస్థానాల నుంచి పాఠశాలలకు నడిచి వస్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చాలా మంది పిల్లలకు గిఫ్ట్ ఏ స్మైల్ కింద పేద విద్యార్థినులకు సైకిళ్లను అందజేసినా ప్రస్తుతం చా లామంది విద్యార్థినులు సై కిళ్లు లేక కాలినడకన బ యలుదేరుతున్నారు. గతంలో విద్యార్థుల కోసం పల్లెవెలుగు బ స్సులు ప్రత్యేకంగా నడిపేవారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమైనప్పటి నుంచి బస్సులు సరిగా లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఎ న్నోసార్లు బస్సుల కోసం తల్లిదండ్రులు సైతం ధ ర్నాలు చేసినా.. ఆర్టీసీ అధికారులకు విన్నవించి నా.. పట్టించుకునే వారే కరువయ్యారని వాపోతున్నారు. ఫలితంగా స్కూళ్లకు సరైన సమయానికి చే రుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. కొంతమంది కాలినడకన వెళ్లలేక చదువుకు దూరమయ్యే పరిస్థితి దాపురించింది.
పేద విద్యార్థులు కాలినడకన వెళ్తుంటే మరి కొంతమంది విద్యార్థులు ప్రైవేటు బస్సుల్లో ప్రైవే ట్ స్కూళ్లకు వెళ్తున్న దృశ్యాలు కలిచివేస్తున్నాయి. విద్యార్థుల అవస్థలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినిధులు మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సులు లేక కాలినడకన వస్తున్న విద్యార్థుల అవస్థలపై ఫోకస్ పెట్టింది. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి కండ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. పేరుకే ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన పేద విద్యార్థుల అవస్థలు పట్టించుకునే నాథుడే లేడనే విమర్శలు వస్తున్నాయి.
చెనుగోనిపల్లి, కొత్తపల్లి, మేళ్లచెరువు, కాకులారం, ఈడిగోనిపల్లి, కుర్వపల్లి, పర్మాల, పూడూ రు తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో వీరు తమ గ్రామాల నుంచి సుమారు 2 కిలోమీటర్ల మీర స్టేజీ వరకు వచ్చి బస్సులు ఎక్కి సమీప పాఠశాలలకు వెళ్తుండగా మరికొంతమంది విద్యార్థులు సైకిళ్లపై వెళ్తున్నారు.
తారాపురం, జోగన్గట్టు, సల్కాపురం, గంగిమాన్దొడ్డి, సోంపురం, కుచ్చినెర్ల, జోహారపురం, రాయపురం, ఎల్లందొడ్డి గ్రామాలకు చెందిన వి ద్యార్థులు ఉన్నత పాఠశాల చదువులు చదవాలం టే గట్టు లేదా మాచర్లకు వెళ్లాలి. వీరు సుమారు మూడు కిలోమీటర్ల మేర కాలినడకన లేదా సైకిళ్లు ఆటోల్లో స్కూల్కు వెళ్తున్నారు.
కోతులగిద్ద, కొత్తపాలెం, జీరబండ, గుర్రంపల్లి, చిన్నపాడు విద్యార్థులు వారి గ్రామాల స్టేజీ వ రకు వచ్చి ధరూర్ ఉన్నత పాఠశాలకు వెళ్తున్నారు.
చాలా గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతూ మండలకేంద్రంతోపాటు నందిన్నెలోని ఉన్నత పాఠశాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎర్సన్దొడ్డి, సుల్తాన్పురం, కుచ్చినెర్ల, గువ్వలదిన్నె, పాగుంట, పాతపాలెం, మైలగడ్డ, రంగాపురం గ్రామాల విద్యార్థులు ఐదు కిలో మీటర్ల మేర కాలినడకన, ఆటోల్లో వచ్చి నందిన్నె, చింతలకుంటల్లోని పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.
నాగర్దొడ్డి, విఠలాపురం, కుర్తిరావులచెర్వు, అడవిరావులచెర్వు, చిప్పదొడ్డి విద్యార్థులు వారి గ్రామం నుంచి సుమారు మూడు కిలోమీటర్లు స్టేజీ వద్దకు వచ్చి మల్దకల్లోని పాఠశాలకు రావాల్సిన పరిస్థితి ఉన్నది.
అలంపూర్ మండలంలోని ర్యాలంపాడు, జిల్లెలపాడు, సుల్తానాపురం, రాజోళి మండలం తూ ర్పు గార్లపాడ్, పడమటి గార్లపాడ్, మాన్దొడ్డి, మానవపాడులో కొర్విపాడ్, చిన్నపోతులపాడు, పెద్దపోతులపాడు, ఇటిక్యాలలోని వావివాల, షాబాద్, ఉండవెల్లి మండలంలోని కంచుపాడ్, తక్కశిల, ప్రాగటూర్, శేరిపల్లి, మారమునగాల, భైరాపురం, బస్వాపురం, అయిజలోని సంకాపురం, ఈడ్గోనిపల్లి, రాజాపురం, కొత్తపల్లి, కిసాన్నగర్, ఉప్పల, ఉప్పలక్యాంప్, జడ్దొడ్డి, గుడిదొడ్డి, రాజాపురం గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో విద్యార్థులు నడిచి, ఆటోల్లో వెళ్లి ఉన్నత చదువులు సాగించాల్సి వస్తున్నది.
దేవరకద్ర, జూలై 2 : మండలంలోని మీనుగోనిపల్లి, బస్వాయిపల్లి, బస్వాపూర్, నార్లోనికుంట, వెంకటయ్యపల్లి, గద్దెగూడెం, వెంకటాయపల్లి తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే సమీప గ్రామాలకు కాలినడకన లేదా ఆటోల్లో ప్రయాణించి చదువుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఆర్థిక స్థోమత అంతంత మాత్రంగానే ఉన్న విద్యార్థులు ప్రాథమిక విద్యకే పరిమితం అవుతున్నారు. అయితే ప్రభుత్వం ఆయా గ్రామాలకు ఉదయం, సాయంత్రం వేళల్లో బస్సు సౌకర్యం కల్పిస్తే మిగతా వారు కూడా చదువుకొనే అవకాశం ఉందని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, ప్రజలు కోరుతున్నారు.