ఐఏఎస్ల బదిలీల్లో భాగంగా ఉమ్మడి జిల్లాకు వచ్చిన నలుగురు కొత్త కలెక్టర్లు ఆదివారం ఆయా కలెక్టరేట్లలో బాధ్యతలు చేపట్టారు. మహబూబ్నగర్ కలెక్టర్గా విజయేందిర బోయి, నాగర్కర్నూల్ కలెక్టర్గా బదావత్ సంతోష్, వనపర్తి కలెక్టర్గా ఆదర్శ్ సురభి, నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్ కొలువుదీరారు. ఈ సందర్భంగా వారికి అధికారులు స్వాగతం పలికారు.