వానకాలం ప్రారంభమై నెల కావొస్తున్నా వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పెబ్బేరు మండలం రంగాపురం వద్ద ఉన్న కృష్ణానది పరివాహక ప్రాంతం ఇప్పటికీ రాళ్లు తేలి కళావిహీనంగా కనిపిస్తున్నది. వర్షాలు సకాలంలో కురిస్తే ఇప్పటికే నదులు, చెరువులు, కుంటలు నీటితో కళకళలాడేవి. సాగు పనులు కూడా మొదలయ్యేవి. జూరాల ప్రాజెక్టు నిండి క్రస్ట్ గేట్ల ద్వారా విడుదలైన నీళ్లు బీచుపల్లి మీదుగా శ్రీశైలానికి పరుగులు పెట్టేవి. కానీ ప్రస్తుతం కృష్ణానది చుక్కనీరు లేక బోసిపోయి కనిపిస్తున్నది.
– పెబ్బేరు, జూన్ 30
మహబూబ్నగర్ అ ర్బన్, జూన్ 30 : విద్యార్థులు ప్రతిభ కనబర్చి ఉ న్నత శిఖరాలను అధిరోహించాలని మాజీ మం త్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. ఆదివారం మహబూబ్నగర్లోని ప్యారడైజ్ కన్వెన్షన్ హాల్లో గౌడ, విశ్రాంత ఉద్యోగు ల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కా ర్యక్రమానికి మాజీ మంత్రి హాజరై వివిధ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాల ను అందజేసి సన్మానించారు.
అదేవిధంగా ప్రమోషన్ పొందిన ఉద్యోగులను సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ ఉన్నతంగా చదివి ప్రతిభ కనబర్చిన వారికి గౌడ అసోసియేషన్ తరఫున సన్మాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్గౌడ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, గ్రేటర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటస్వామిగౌడ్, సా యిలుగౌడ్, గౌడ హాస్టల్ రాష్ట్ర అధ్యక్షుడు చక్రవర్తిగౌడ్, పురుషోత్తంగౌడ్, శ్రీధర్గౌడ్ ఉన్నారు.