కల్వకుర్తి, జూలై 1 : ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తన ప్రయాణం బీఆర్ఎస్తోనేనని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలు ఒక మార్గమని.. ప్రజలకు మంచి చేసిన నాయకులకు చరిత్రలో ఖచ్చితంగా ఒక పేజీ ఉంటుందని.. అందులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆమనగల్లులోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సోమవారం ఆత్మీయ సన్మానం నిర్వహించారు. చేశారు. కార్యక్రమానికి ఎమ్మె ల్సీ నవీన్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్పీ, తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్ హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్సీగా గెలుపొందిన నవీన్కుమార్రెడ్డిని వారు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు సేవా పురస్కారాలను అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాప్రతినిధులకు గౌరవవేతనాలు నిలుపుదల చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో ఉండటంతోనే సీఎం రేవంత్రెడ్డి నీచమైన సంస్కృతికి తెరలేపారని విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన వెంటే ఉంటానని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్సీగా పోటీ నుంచి తప్పుకుంటే కాంగ్రెస్ పార్టీ తనకు రూ.30కోట్లతో పాటు కార్పొరేషన్ పదవి ఇస్తామని ప్రలోభాలకు గురిచేసిందని గుర్తు చేశారు. సీఎం సొంత జిల్లాలోనే తాను బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలవడం రేవంత్రెడ్డికి చెంపపెట్టులాంటిదని ఎద్దేవా చేశారు.. ఈ సందర్భంగా తనను గెలిపించిన పాలమూరు ప్రజాప్రతినిధులకు ఆయ న కృతజ్ఞతలు తెలిపారు. వెంకటేశ్ తన ట్రస్టు ద్వారా చేస్తు న్న సేవలు అభినందనీయమని.. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆయన ఆకాంక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి బీఆర్ఎస్ కా ర్యకర్తకు అండగా ఉంటానని వెంకటేశ్ భరోసానిచ్చారు. వచ్చే కాలం బీఆర్ఎస్దేనని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచూపుదామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీలు అనురాధ, దశరథ్నాయక్, ఎంపీపీలు నిర్మల, మనోహర, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.