నాగర్కర్నూల్/తాడూరు, జూలై 3 : నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజేశ్రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి పరదా రాజకీయాలు మాని పాలనపై దృష్టి సారించాలని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. బుధవారం సిర్సవా డ, తాడూరు గ్రామాల్లో ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మర్రి రిటైల్ కంపెనీతో నిర్మించిన పాఠశాలలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మా ఎమ్మెల్యే మర్రి విలేకరుల తో మాట్లాడుతూ తాము నిర్మించిన పాఠశాలలకు ట్రస్ట్ పేర్లను తూడ్చివేయడం, పేర్లకు పరదాకప్పి పాఠశాలలు, వంట గదులను ప్రారంభించడం సిగ్గుచేటన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపుమేరకు మన ఊరు-మనబడిలో భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో సిర్సవాడ, తా డూరు గ్రామాల్లో పాఠశాలలను సుందరంగా నిర్మించామన్నారు. సిర్సవాడ పాఠశాలను తాను గతంలోనే ప్రారంభించినప్పటికీ.. ట్రస్ట్ పేరుకు పరదా కట్టి మళ్లీ ప్రస్తుత ఎమ్మెల్యే ప్రారంభించి నీచరాజకీయాలు చేస్తున్నాడని విమర్శించా రు. ట్రస్ట్ బోర్డుపై పేర్లను తూడ్చగలిగారు కానీ.. ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రుల మనస్సులో మర్రి జనార్దన్రెడ్డిని తొలగించలేరన్నారు. రూ. 60 లక్షల ప్రభుత్వ నిధులతో కేవలం వంటగదులు, ప్రహరీ నిర్మించామని.., కానీ పాఠశాల మొత్తం వాటితోనే కట్టామని ఆరోపించడం సరికాదన్నారు. ప్రభుత్వ నిధులతోనే పాఠశాల నిర్మించినట్లు రుజు వు చేస్తే.. తాను ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు. ‘తూడుకుర్తి, తాడూరు దవాఖాన, కళాశాలకు భూమి ఇచ్చి ప్రభుత్వ నిధులతో కట్టించిన వాటికే మీ పేర్లు పెట్టుకున్నా రు.. మీలాగే నేను అలా చేయాలంటే ఆ పేర్లను తూడ్చివేసేవాడిని’ అని అన్నారు. ‘నేను చేసినంత అభివృద్ధిని మీరు చేస్తే మా కార్యకర్తలతో వచ్చి సన్మానం చేస్తా’ అని సవాల్ విసిరారు. మీవల్ల ఏదీ కాదని, ఏడు నెలలకే ఏమీ చేయలేరనే విషయం ప్రజలకు అర్థమైందన్నారు. తాను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు క్యాంప్ కార్యాలయానికి ఏదో ఒక పనికో సం వెయ్యి మంది వచ్చేవారని, మీ వద్దకు పదిమంది కూడా వస్తలేరంటే ఏం జరుగుతున్నదో అర్థం కావాలన్నారు.
ప్రభుత్వ అధికారులు సైతం ప్రభుత్వానికి వంత పాడుతున్నారని, న్యాయం వైపు ఉండాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు పదవులు, అధికారులకు పోస్టులు శాశ్వతం కాదని, ఎక్కడ చేశామన్నది కాదని, ఎన్ని మంచి పనులు చేశామన్నదే గుర్తింపు ఉంటుందన్నారు. పాఠశాల ప్రారంభించే విషయంలో జిల్లా అధికారులతో మాట్లాడితే కనీసం ఫోన్ కూడా ఎత్తడం లేదని మండిపడ్డారు. పోలీసులు సై తం ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో నాగర్కర్నూల్ ప్రాంతంలో ఇసుకమాఫియా పురుడుపోసుకున్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి ఆరోపించారు. నాడు ఆన్లైన్లో ఇసుకను బుక్ చేసుకొని ట్రాక్టర్ల ద్వారా తరలించేవారని.., నేడు టిప్పర్లతో తరలిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారన్నారు. మా కార్యకర్తలను వేదిస్తే ఊరుకునేది లేద ని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ హన్మంత్రావు, మున్సిపల్ వైస్చైర్మన్ బాబురావు, నాయకులు రమేశ్రెడ్డి, వేణుకుమార్, సమద్పాషా, రమణ, తిరుపతిరెడ్డి, అనిల్రెడ్డి, నాగయ్య, శేఖర్గౌడ్, పర్వతాలు, మశన్న, కృష్ణయ్య, బాలవెంకటయ్య, శేఖర్గౌడ్, జలీల్ తదితరులు పాల్గొన్నారు.