మరికల్, డిసెంబర్ 13 : మండలంలోని పెద్దచెరువు కట్టపై ఏ ర్పాటు చేస్తున్న మినీ ట్యాంక్ బండ్ పనులు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టాల్ అన్నారు. మినీ ట్యాంక్ బండ్ పనులను మంగళవారం పరిశీలించారు. పనులు ఎందుకు పెండింగ్లో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్యాంక్ బండ్ పనులు జనవరి చివరి నాటి కీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, వాకింగ్ ట్రాక్, రోడ్డు పనులు, జంగల్ కట్టింగ్ త దితర పనులు వెంటనే చేపట్టాలని పేర్కొన్నారు. రూ.3.45కోట్లు వెచ్చించి పనులు చేపడితే ఇప్పటి వరకు రూ.2.45 పనులు పూర్తి చేశారన్నారు, రూ. కోటి వరకు పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. రోడ్డు పనులు వెంటనే చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు.
జంగల్ కట్టింగ్ ఎం దుకు చేపట్టాలేదని అధికారులను అడుగగా చేస్తున్నామని, వర్షం కారణంగా పనులు చేయలేదన్నా రు. కారణాలు చెప్పకుండా పనులు పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. పనులు ఎప్పుడు ప్రారంభిస్తార ని, తమకు పూర్తిస్థాయి సమాచారం అందించాల ని, పనులు కొనసాగుతున్న ఫొటోలు పంపించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గోవర్ధన్, నీటిపారుదల శాఖ ఈఈ ప్రతాప్సింగ్, డీఈ కిరణ్కుమార్, ఎంపీడీవో యశోదమ్మ, ఎంపీవో బాలాజీ, కార్యదర్శి శ్రీనివాస్రావు పాల్గొన్నారు.