గద్వాల, జూలై 1 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్రెడ్డి మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతూ సోమవారం గద్వాలలో నిరుద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణవేణి చౌరస్తా నుంచి ర్యాలీ మొదలై కలెక్టరేట్కు చేరుకొని అక్కడే ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరుద్యోగ సంఘం నాయకులు చంద్రశేఖర్, సైదన్న, శివరాం, వీరేశ్ మాట్లాడారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని.. మెగా డీఎస్సీతో టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీల అమలులో విఫలమైందన్నారు. ప్రమోషన్ల ద్వారా జిల్లాలో కొత్తగా ఏర్పడిన ఉపాధ్యాయ ఖాళీలను 2023 పాత డీఎస్సీలో కలిపి పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. జూన్లో టెట్ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని వారికి సమయం కేటాయిస్తూ డీఎస్సీని వాయిదా వేయాలని కోరారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ సంతోష్కు అందజేశారు. కార్యక్రమంలో నిరుద్యోగులు సునీల్, అశోక్, నర్సింహ, మహేశ్ తదితరులు పాల్గొన్నారు.