మహబూబ్నగర్, జూన్ 20 : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చే స్తానని మహబూబ్నగర్ ఎస్పీ జానకి ధరావత్ అన్నారు. గురువా రం జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో ఎస్పీ హర్షవర్ధన్ నుం చి ఆమె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడు తూ జిల్లా పరిధిలోని ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల భద్రత, రక్షణే ప్రధాన ల క్ష్యంగా పనిచేస్తామన్నారు. ఇసుక దందాపై ప్ర త్యేకంగా దృష్టి సారించి అక్రమాలను అరికడతామన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చే స్తానని, డ్రగ్స్ రవాణాను అడ్డుకుంటామన్నారు. పోలీస్స్టేషన్కు వచ్చే సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎవరై నా విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చ ర్యలు తప్పవన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు, విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై క ఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాములు, ఏఆర్ ఎ స్పీ సురేశ్కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లుతోపాటు సీఐలు, డీపీవో సిబ్బంది ఎస్పీకి మొక్కలను అం దజేసి శుభాకాంక్షలు తెలిపారు.