వనపర్తి, జూన్ 7 : తన గెలుపు కోసం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఎంతో కృషి చేశారని స్థానికసంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని మాజీ మం త్రి నివాసంలో ఆయనను ఎమ్మెల్సీ నవీన్రెడ్డి దంపతులు కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా నవీన్రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టినా.. సమర్థవంతంగా ఎదుర్కొని రాజకీయ చతురతో తనను గెలిపించారన్నారు. వారి మార్గదర్శకత్వంలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, స్థానిక సంస్థల నాయకుల హక్కుల కోసం కూడా పోరాడుతానని ఆయన ప్రకటించారు.