మహబూబ్నగర్ అర్బన్, జూలై 3 : రాష్ట్ర సాధనకు ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం గడిపి తెలంగాణను సాధించుకున్నామని.. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తె లంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అ ని, బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్నింటా అభివృద్ధి సాధించిందని చెప్పుకొచ్చారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెడ్పీటీసీ, ఎంపీ పీ, ఎంపీటీసీలు, కో-ఆప్షన్ సభ్యుల సన్మాన కా ర్యక్రమానికి ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డితో కలిసి మాజీ మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పదవీకాలం పూర్తి చేసుకున్న జె డ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలను పూలమాలలు, శా లువాలు, మెమెంటోలు అందజేసి సన్మానించా రు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన నవీన్కుమార్రెడ్డిని మాజీ మంత్రితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ కాంగ్రె స్ పార్టీ అబద్ధపు హామీలను చెప్పి అధికారంలోకి వచ్చిందని, ప్రజలు కూడా జరిగిన పొరపాటును ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారన్నారు. ఆరు గ్యారెంటీలు అమలుకు సాధ్యం కాదని తెలిసినా అధికారం కోసం తప్పుడు ప్రచారం చేశారన్నారు. పెంచిన పింఛన్లు, మహిళలకు రూ.2500 భృతి, రైతులకు రుణమాఫీ, ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వకుండా ప్రజాపాలన అంటూ చెప్పుకోవడమే త ప్పా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలో ప్రజలు కరెంట్, సాగు, తాగు నీటి కోసం ఇబ్బందులు పడలేదని, ఇప్పుడు పంటలు వేసుకున్న రైతులకు కరెంట్ సరఫరా లేక సాగునీరు లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొద్ది మంది పార్టీ మారాలని చూస్తున్నారని, పార్టీని వదిలి పెట్టడం అంటే కన్నతల్లిని వదిలేసినట్లేనని పేర్కొన్నారు. అగ్ని పరీక్షలో నిలబడిన వారే అసలైన నాయకులు, కార్యకర్త అని చెప్పారు. మనం చేసిన పొరపాట్లను సరిచేసుకొని ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని ప్రజాప్రతినిధులు, నాయకులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్సీ నవీన్రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారానికి జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, కో ఆప్షన్ సభ్యులు కష్టపడి పనిచేశారన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పాలమూరును హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేశారని గుర్తు చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు నమ్మకంతో కష్టపడి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా మాజీ చైర్మన్ రాజేశ్వర్గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, వైస్చైర్మన్ గణేశ్, డీసీసీ వైస్ చైర్మన్ వెంకటయ్య, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, ఎంపీపీలు బాలరాజు, సుధాశ్రీ, నాయకులు శివరాజ్, కరుణకర్గౌడ్, దేవేందర్రెడ్డి, రాఘవేందర్, శ్రీనివాస్రెడ్డి, నవకాంత్, సాయిలు పాల్గొన్నారు.