దేవరకద్ర, జూన్ 27 : కోయిల్సాగర్కు జూరాల నుంచి కృష్ణాజలాలు వస్తుండటంతో గురువారం ప్రాజెక్టు నీటిమట్టం 15 అడుగులకు చేరింది. కోయిల్సాగర్ నిల్వ సామర్థ్యం 32.5 అడుగులు కాగా.. 17.5 ఫీట్లకు నీరు చేరితే షెట్టర్లను తెరుస్తారు. కాగా వరద రాకతో కోయిల్సాగర్ జలకళను సంతరించుకున్నది. ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం పెరుగుతుండటంతో ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బల్మూరు, జూన్ 27 : మండలంలోని కొండారెడ్డిపల్లిలో గురువారం గువ్వకుంట వద్దనున్న తూంబండపై వరద పాశం పోశారు. 15 రోజులుగా వర్షం కురవకపోవడంతో గ్రామస్తులంతా చందాలు వేసుకొని ప్రసాదం తయారుచేశారు. వరదపాశాన్ని గ్రామంలో భజన చేస్తూ ఊరేగించి కుంట వద్దకు తీసుకెళ్లి పూజలు చేశారు. అనంతరం గ్రామానికి చెందిన యాదవ కులస్తులు బండపైన పోసిన పాశాన్ని నాలుకతో తాగారు. త్వరగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని వరుణుడిని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామస్తు లు పంబ రాధాకృష్ణ, వెంకటయ్య, వెంకటేశ్, తిరుపతయ్య, వెంకట్స్వామి, నిరంజన్ తదితరులున్నారు.
నాగర్కర్నూల్ టౌన్, జూన్ 27 : నాగర్కర్నూల్ శివారులోని కొల్లాపూర్ చౌరస్తా వద్ద ఉన్న వైభవ్ గార్డెన్లో ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ని ర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి గురువారం ప్రకటనలో పేర్కొన్నారు. సభాధ్యక్షులుగా మర్రి, ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ హాజరవుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.