వనపర్తి, జూలై 4 (నమస్తే తెలంగాణ) : అధికారం ఎవరికీ శాశ్వతం కాదని.. పదవిలో ఉన్నప్పుడు చేసిన పనులే చిరకాలం నిలిచిపోతాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. పదేండ్ల తెలంగాణలో నాటి సీఎం కేసీఆర్ అద్భుతమైన పాలన అందించారని, 14 ఏండ్లపా టు తెలంగాణ కోసం సుధీర్ఘ పోరాటం చేసి స్వరాష్ర్టాన్ని సాధించిన ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించా రు. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలుగా పనిచేసిన వారికి గురువారం మాజీ మంత్రి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పదేండ్లలో బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీ లు ఇచ్చిందన్నారు. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయలేక కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అద్భుతంగా పనిచేసిన మిషన్ భగీరథ పథకంపై రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అంటేనే తెలంగాణ వ్యతిరేకి అన్నారు.
తెలంగాణకు ద్రోహం చేసిన వారు మళ్లీ ఇప్పుడు మన రాష్ట్ర చర్యల్లో పాలుపంచుకుంటున్నారని, చంద్రబాబులాంటి వ్యక్తులతో తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గతంలో ఆంధ్రా కు సీఎంగా పని చేసిన చంద్రబాబు నాడు ఎందుకు నాటి సీఎం కేసీఆర్కు లేఖ రాయలేదని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపితేనే సీఎంగా ప్రమాణం చేస్తానని చెప్పి అప్పట్లో తీసుకుపోయిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు చూపుతున్న శ్రద్ధ కేవలం తెలంగాణకు నష్టం కలిగించడానికే తప్పా మరొకటి కాదన్నారు. ప్రస్తుత చర్యల వల్ల వచ్చే రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు మారుతాయన్నారు. చంద్రబాబు, రేవంత్రెడ్డిల సమక్షంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగబోతుందని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అప్రమత్తం కావాలని కోరారు. పదవీకాలం ముగిసిన వివిధ ప్రజాప్రతినిధులంతా కేసీఆర్ను ఆదర్శంగా తీసుకోవాలని, పదవులు లేకున్నా నిత్యం ప్రజ ల్లో ఉండి చేదోడుగా ఉండాలన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటే విధంగా కార్యాచరణ మొదలవుతుందని, ఇందుకు తాజా మాజీ ప్రతినిధులంతా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.