మహబూబ్నగర్ అర్బన్, జూలై 2 : ఉద్యోగాల ను భర్తీ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివప్రసాద్ డిమాండ్ చేశా రు. మహబూబ్నగర్ కలెక్టరేట్ ఎదుట ఏబీవీపీ పాలమూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా శివప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ ఓట్లు దండుకున్నదని.., అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు. ప్రజా ప్రభుత్వం అంటూ గొప్పలు చె ప్పడం తప్పా చేసిందేమీ లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మెగా డీఎస్సీ నిర్వహించి 24 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు శివసాగర్, అరుణ, కార్తీక్, వరుణ్, సిద్ధు, సాయి పాల్గొన్నారు.