పాలమూరు, జూలై 1 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను వెంటనే నెరవేర్చాలని పీయూ బీఆర్ఎస్వీ కన్వీనర్ గడ్డం భరత్బాబు డిమాండ్ చేశారు. సోమవారం పాలమూరు విశ్వవిద్యాలయం ప్రధాన ముఖద్వారం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి స్పష్టమైన హామీలిచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చాక వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పి ఏడు నెలలు గడుస్తున్నా హామీలను అమలు చేయడంలేదని.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. లక్ష ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం దౌర్భాగ్యమన్నారు.
గ్రూప్-1, మెయిన్స్కు 1:100 ప్రకారం ఎంపిక చేయాలని, గ్రూప్-2లో 2వేలు, గ్రూప్-3లో 3వేల పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ వేస్తామని చెప్పి నేడు 12వేల పోస్టులు ప్రకటించి నిరుద్యోగులను నిండా ముంచిందని ధ్వజమెత్తారు. వెంటనే 24 వేల పోస్టులతో కూడిన మెగా డీఎస్సీ నోటికేషన్ ఇచ్చి టీచర్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. ఉస్మానియా జేఏసీ విద్యార్థి మోతీలాల్ ఎనిమిది రోజులుగా నిరాహారదీక్ష చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోడం దారుణమన్నారు. సీఎం రేవంత్రెడ్డి గాం ధీ దవాఖానకు వెళ్లి మోతీలాల్ చేత దీక్షను విరమింపజేయాలని కోరారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామ ని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నా యకులు రమేశ్, ఆంజనేయులు, రాఘవేం ద్ర, నవీన్గౌడ్, సాయి, కుమార్, ప్రవీణ్, శ్రీకాం త్, మౌనిక, మమత, నిరుద్యోగులు పాల్గొన్నారు.