గద్వాల అర్బన్, జూలై 2 : ఆషాఢమాసంలో నిర్వహించే బల్కంపేట ఎల్లమ్మ అ మ్మవారి కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని గద్వాల చేనేత కార్మికులు చీర సమర్పించడం ఆనవాయితీ. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీలో చేనేత కార్మికుడు నివాసంలో సంప్రదాయ బద్ధంగా చేనేత తయారీకి ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతి ప్రత్యేక పూజలు చేసి చీర తయారీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బండ్ల జ్యోతి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సాయిశ్యాంరెడ్డి, సతీశ్, గోవింద్, ధర్మనాయుడు, ఓంప్రకాశ్, కురుమన్న, మహేశ్ తదితరులు ఉన్నారు.