అచ్చంపేట, జూన్ 13 : కాంగ్రెస్ పార్టీ గూం డాలు, రౌడీలతో ఎమ్మెల్యే చేయిస్తున్న దాడులకు భ యపడేదిలేదని వారి ఆగడాలను అడ్డుకుంటామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఉద్యమకారుడు, బీసీ బిడ్డ అయిన మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్పై అవిశ్వా సం పెట్టి దింపడంతోనే అచ్చంపేటలో ఎమ్మెల్యే వం శీకృష్ణ పతనం ఆరంభమైందన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్పై పెట్టిన అవిశ్వాసానికి వ్యతిరేకంగా అచ్చంపేటలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే వంశీకృష్ణకు బీఆర్ఎస్ నేతలు, కౌన్సిలర్లను భయపెట్టి, దాడులు చేసి, అక్ర మ కేసులు బనాయించి, భయబ్రాంతులకు గురిచేసి పార్టీలో చేర్చుకోవడానికి సిగ్గుండాలన్నారు.
అక్రమ ఇసుక, మైనింగ్, భూదందాల పేరుతో ఆర్థికంగా సం పాదించుకొని రాజకీయంగా బలపడి అచ్చంపేటలో మల్టీస్పెషాలిటీ దవాఖాన నిర్మాణం చేపట్టేందుకు ప్ర యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్న ఎమ్మెల్యే పనితీరును అచ్చంపేట ప్రజలు గమనిస్తున్నారని, వారికి తగిన సమయంలో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నా రు. అవిశ్వాసంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విప్ జారీ చేస్తే ఈ పత్రాలను తీసుకొని మా పార్టీ నేతలు ఆర్డీవో కార్యాలయానికి వెళ్తే ఆర్డీవో మాధవి కావాలని కార్యాలయానికి రాకుండా, ఫోన్లు ఎత్తకుండా మధ్యాహ్నం 12గంటలకు కార్యాలయానికి వచ్చారని ఇందులో మొదటి ముద్దాయి ఆర్డీవోనే అన్నా రు.
రెండోవార్డు కౌన్సిలర్ సుంకరి నిర్మలాబాలరాజుపై దాడిచేసి, కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేసి అచ్చంపేట ఎస్సై దగ్గరుండి కాంగ్రెస్ క్యాంప్ నకు పంపించారని విమర్శించారు. తనను అచ్చంపేటలో కాలుపెట్టనివ్వకుండా ఎమ్మెల్యే, ఆయన అనుచరులు మాట్లాడుకుంటున్నారని, తనకు రక్షణ కా వాలని స్వయంగా డీజీపీకి కలిసి విన్నవించామన్నా రు. ఇంటలిజెన్స్శాఖ నుంచి ఫోన్లు చేసి అచ్చంపేటలో మీకు ప్రాణహాని ఉందని ఎక్కువగా వెళ్లవద్దని చెబుతున్నారే తప్పా రక్షణ కల్పించడం లేదన్నారు. ఉద్యమాలు మాకు కొత్తకాదని ప్రజల కోసం, పార్టీ శ్రేణుల కోసం ప్రాణాలర్పిచేందుకు సిద్ధమని ప్రకటించారు.
కాంగ్రెస్ దాడులు, కేసులకు భయపడే నైజం తనది కాదన్నారు. కాంగ్రెస్ ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసం నిలబడిన నర్సింహాగౌడ్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు రమేశ్రావు, మన్నుపటేల్, ఖాజాకుత్బుద్దీన్కు ఆయన అభినందనలు తెలిపా రు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, సీనియర్ నేత కేటీ తిరుపతయ్య, కౌన్సిలర్లు రమేశ్రావు, ఖాజాకుత్బుద్ద్దీన్, జెడ్పీటీసీ రాంబాబు, చెన్నకేశవులు, అమీనొద్దీన్, శంకర్మాదిగ, సురేశ్, మాజీ సర్పంచ్ బొడ్కానాయక్, రంగాపూర్ వెంకటయ్య, వంశీనాయక్, రానోజీ, శ్రీను, అల్లెశ్రీనివాసులు, రాము, పెంటయ్య, నిరంజన్, బాబు, రాకేశ్, రవి తదితరులు పాల్గొన్నారు.