కల్వకుర్తి, జూన్ 29 : ఆరు గ్యారెంటీలతోపాటు ఇతర హామీలను కాం గ్రెస్ విస్మరించి అధికారమదంతో నీచ రాజకీయాలకు పాల్పడుతున్నదని మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రాజేందర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినే త ఉప్పల వెంకటేశ్ ఇంట్లో మాజీ ఎమ్మెల్యేలతో పలువురు బీఆర్ఎస్ నాయకులు ఆత్మీ య సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలకు వెంకటేశ్ స్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యేలు అక్కడున్న నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రం గాల్లో విఫలమై, ఏడు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఎద్దేవా చేశారు. అటువంటి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెట్టే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ పనితీరును గ్రామగ్రామాన ఎండగడుతూ బీఆర్ఎస్కు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. పాల బిల్లులు, రైతుబంధు, రుణమాఫీ కోసం రైతులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు, తాగునీటి కోసం మహిళలు, కరెంట్ కోతలను నిరసిస్తూ చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలు.. ఇలా అందరూ ఆందోళన చెందుతుంటే సీఎం, మంత్రులు హైదరాబాద్-ఢిల్లీకి ప్రయాణాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. విషపూరిత రాజకీయాలు చేస్తూ ప్ర జా సమస్యలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారిని ఎందుకు గెలిపించుకున్నామని ప్రజలు నేడు బాధపడుతున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్యాదవ్తో పాటు ఉమ్మడి జిల్లా నాయకులు పాల్గొన్నారు.