వనపర్తి, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కారు నిలువునా మోసం చేస్తూ అన్నదాతలను అరిగోస పెడుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఆం క్షల్లేకుండా రుణమాఫీ చేయాలని గురువారం వనపర్తిలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ ఆ ధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో నిరంజన్రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేవలం 9 నెలల పాలనలోనే రైతుల కంట కన్నీరు తెప్పించిన ఘనత రేవంత్రెడ్డి సర్కారుకు దక్కిందని, ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పరిపాలన ను గాలికొదిలేసి అమలుకు సాధ్యం కాని హామీలు, అసత్య ప్రచారాలతో టైంపాస్ చేస్తున్నట్లు విమర్శించారు.
రుణమాఫీపై ఆర్థిక, రెవెన్యూ, వ్యవసాయ మంత్రులు చెప్పే మాటలకు, లెక్కలకు ఎలాంటి పొంతన లేదన్నారు. రాష్ట్రంలో 70 లక్షల రైతు కు టుంబాలుండగా, కాంగ్రెసోళ్లు పావువంతు మాఫీ చేసి బ్యాంకులు, అధికారుల చుట్టూ రైతులను తిప్పతున్నారని మండిపడ్డారు. ఆగస్టు 15వ తేదీలోపే పంటరుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పి ఎం దుకు చేయలేదని ప్రశ్నించారు. వానకాలం సీజన్ చివరి దశలో ఉన్నా ఇస్తామన్న రూ.7,500 రైతుభరోసా ఇప్పటికీ రూపాయి కూడా లేదన్నారు. ఉచిత బస్సు మినహా కాంగ్రెస్ గ్యారెంటీలన్నీ బోగస్గా తే లిపోయాయన్నారు. తెలంగాణను అన్నపూర్ణ రా ష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని, పదేండ్ల కాలంలో ఎండాకాలంలోనూ చెరువులు గలగల అలుగులు పారాయన్నారు.
ప్రస్తుతం స ముద్రంలోకి నీళ్లు వెళ్తున్నా పంట కాల్వలకు, పొలాలకు నీళ్లిచ్చే దిక్కులేకుండా పోయిందని మండిపడ్డారు. నిరుద్యోగులు, రైతులు, పాడిరైతులు, ఉద్యోగులు ఇలా అన్నిరంగాల వారు రోడ్లపైకి వచ్చి ధర్నా లు చేయాల్సిన దుస్థితి కాంగ్రెస్ కల్పించిందన్నారు. ఆంక్షల్లేకుండా రుణమాఫీ అమలు చేసే వరకు ప్ర భుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదన్నారు. ధర్నా అనంత రం ర్యాలీగా వెళ్లి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశా రు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, పట్టణాధ్యక్షుడు రమేశ్ గౌడ్, మాణిక్యం, సతీశ్రెడ్డి, అశోక్, రమేశ్, తిరుమల్, నా గన్న యాదవ్, ప్రేమ్నాథ్రెడ్డి, గులాం ఖాదర్, మ హేశ్వర్ రెడ్డి, బీచుపల్లి యాదవ్, కొండన్న తదితరు లు పాల్గొన్నారు.